ఇక చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని సంభోదించగా.. దీనిపై తనదైన స్టయిల్లో రియాక్ట్ అయ్యారు ఏఎన్నార్. ఏఎన్నార్, ఎన్టీఆర్ రెండు కళ్లు అయితే మిగిలిన వాళ్లంతా ఏమైపోయినట్టు.. ఎస్వీ రంగారావు, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం ఏమైంది, వీళ్లంతా ఏమైనట్టు అని ప్రశ్నించారు. ఈ మీడియా రాసే వాటికి ఉబ్బిపోయే పిచ్చివాళ్లు రామారావు కాదు, నేను కాదు అంటూ స్పష్టం చేశారు.