సుశాంత్ మృతి తరువాత తొలిసారి.. మాజీ ప్రేయసి ఎమోషనల్‌ పోస్ట్

First Published Jul 14, 2020, 12:51 PM IST

సుశాంత్‌ నుంచి విడిపోయిన తరువాత కూడా అంకిత అతడి ఫ్యామిలీతో మంచి రిలేషన్‌ మెయిన్‌టైన్‌ చేసేదని వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత పాట్నాలోని అతని ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులకు ఓదార్చిందని వెల్లడించారు. తాజాగా సుశాంత్ మరణించిన నెల రోజుల తరువాత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది అంకిత.

బాలీవుడ్ యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని నెల రోజులు గడుస్తున్నా అభిమానులు ఆ షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణం తరువాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో సుశాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధింంచి కూడా చాలా విషయాలు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్స్‌ వారితో అతని రిలేషన్‌ గురించి కూడా చర్చ జరిగింది.
undefined
ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ అంకితా లోకాండే మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. సుశాంత్ మంచి ఫాంలో ఉన్న సమయంలో అతనితో ఉండి, అవకాశాలు తగ్గాక వదిలివెళ్లిపోయారంటూ సుశాంత్ అభిమానులు అంకిత మీద విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి అంకిత గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
undefined
సుశాంత్‌ నుంచి విడిపోయిన తరువాత కూడా అంకిత అతడి ఫ్యామిలీతో మంచి రిలేషన్‌ మెయిన్‌టైన్‌ చేసేదని వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత పాట్నాలోని అతని ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులకు ఓదార్చిందని వెల్లడించారు. తాజాగా సుశాంత్ మరణించిన నెల రోజుల తరువాత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది అంకిత.
undefined
తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో దేవుడి గదిలో ఉన్న దీపం ఫోటోను పోస్ట్ చేసిన అంకిత `చైల్డ్‌ ఆఫ్‌ గాడ్‌` అంటూ కామెంట్ చేసింది. అయితే అంకిత తన పోస్ట్‌లో సుశాంత్‌ గురించి ఎలాంటి కామెంట్ చేయకపోయినా సుశాంత్ మరణించిన నెల రోజుల తరువాత ఆ పోస్ట్ చేయటంతో సుశాంత్ గురించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు అభిమానులు.
undefined
గత నెల 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరగటంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
undefined
click me!