ఈ మూవీలో చివర్లో మీనాక్షి చౌదరీ.. వెంకీ, ఐశ్వర్యల ఇంటి ముందుకు అద్దెకు దిగుతుంది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మరింత ఫన్నీగా సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. సినిమా ఎక్కడెక్కడో తిరిగి రాజమండ్రిలో వచ్చి ఆగింది, అక్కడి నుంచి మరో కథని చేయనున్నట్టు తెలిపారు.
నిజానికి ఈ కథకి సీక్వెల్ చేయడానికి చాలా స్కోప్ ఉందని, మళ్లీ మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అని వెల్లడించారు. మొత్తంగా `సంక్రాంతికి వస్తున్నాం` మూవీకి సీక్వెల్ ని తీయబోతున్నారు. మరి ఇప్పటి మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే `ఎఫ్ 2` మూవీ విజయం సాధించింది. దానికి సీక్వెల్గా వచ్చిన `ఎఫ్ 3` ఆడలేదు. మరి ఈ సీక్వెల్ వర్కౌట్ అవుతుందా? అనేది సస్పెన్స్.