`సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?

Published : Jan 19, 2025, 05:34 PM ISTUpdated : Jan 19, 2025, 06:26 PM IST

వెంకటేష్‌, ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా రూపొందిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఈ సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. దీనికి సీక్వెల్‌ని ప్రకటించారు అనిల్‌ రావిపూడి.   

PREV
15
`సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?

విక్టరీ వెంకటేష్‌ చాలా రోజుల తర్వాత బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు యావరేజ్‌గా ఆడుతున్నా, హిట్‌ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లని సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు వంద, 150కోట్లు దాటి, రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. 

25

`సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఐదు రోజుల్లోనే రూ.161కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. రూ.45కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని, లాభాల బాట పడుతుంది. ఈ మూవీతో అటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడికి భారీ లాభాలను తీసుకురాబోతుంది. ఈ మూవీ నిర్మాణంలో అనిల్‌ రావిపూడి కూడా భాగం అయినట్టు సమాచారం. 
 

35

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్‌ రాబోతుందట. గతంలోనూ సీక్వెల్‌ ఉంటుందనే హింట్స్‌ ఇస్తూ వచ్చారు మేకర్స్. తాజాగా అనిల్‌ రావిపూడి స్వయంగా వెల్లడించారు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకి సీక్వెల్‌ ఉంటుందన్నారు. `మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం` అనే టైటిల్‌ని కూడా చెప్పారు. వచ్చే సంక్రాంతికి ఈ సీక్వెల్‌ని తీసుకురాబోతున్నామని తెలిపారు అనిల్‌ రావిపూడి. 
 

45

ఈ మూవీలో చివర్లో మీనాక్షి చౌదరీ.. వెంకీ, ఐశ్వర్యల ఇంటి ముందుకు అద్దెకు దిగుతుంది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మరింత ఫన్నీగా సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. సినిమా ఎక్కడెక్కడో తిరిగి రాజమండ్రిలో వచ్చి ఆగింది, అక్కడి నుంచి మరో కథని చేయనున్నట్టు తెలిపారు.

నిజానికి ఈ కథకి సీక్వెల్‌ చేయడానికి చాలా స్కోప్‌ ఉందని, మళ్లీ మరో మ్యాజిక్‌ చేయడానికి రెడీ అని వెల్లడించారు. మొత్తంగా `సంక్రాంతికి వస్తున్నాం` మూవీకి సీక్వెల్‌ ని తీయబోతున్నారు. మరి ఇప్పటి మ్యాజిక్‌ మళ్లీ వర్కౌట్‌ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే `ఎఫ్‌ 2` మూవీ విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన `ఎఫ్‌ 3` ఆడలేదు. మరి ఈ సీక్వెల్‌ వర్కౌట్‌ అవుతుందా? అనేది సస్పెన్స్. 
 

55

వెంకటేష్‌ హీరోగా మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఆడియెన్స్ ని విశేషంగా అలరించింది. ఇందులో నరేష్‌, వీటీవీ గణేష్‌, మురళీధర్‌ గౌడ్‌, పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. 

read more: సీఎంగా పవన్‌ కళ్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్‌, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్?

also read: తన డ్రీమ్ రోల్ చెప్పి షాకిచ్చిన నరేష్.. పద్మ అవార్డు కోసం పోరాడతా అంటూ కామెంట్స్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories