రా.. రా.. రక్కమ్మ.. అంటూ అనసూయ రచ్చ.. హోటల్‌ వెయిటర్స్ తో కలిసి చిందులేసిన రంగమ్మత్త..

First Published Dec 9, 2022, 10:38 AM IST

యాంకర్‌ అనసూయ టీవీ షోస్‌ లేకపోవడంతో ఫ్రీగా ఉంది. దీంతో టూర్లు ఎంజాయ్ చేస్తుంది. చిలిపి పోజులతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తాజాగా వెయిటర్లతో కలిసి డాన్సు చేయడం వైరల్‌గా మారింది. 
 

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ(Anasuya) వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. టీవీ షోస్‌కి గ్యాప్‌ ఇచ్చిన విషయంతెలిసిందే. మంచి ఎగ్జైటింగ్‌ షో తగిలినప్పుడు చేస్తానని చెప్పింది. దీంతో ఫ్రీ టైమ్‌ని పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేసేందుకు వాడుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రావెలింగ్‌ చేస్తుంది. 

అందులో భాగంగా ఓ హోటల్‌లో చిందులేసింది. హోటల్‌లోకి వెయిటర్లతో కలిసి ఆమె మాస్‌ చెప్పులేసింది. `రా రా రక్కమ్మ... ఎక్క సక్క  ఎక్కా సక్కా.. ` అనే పాటకు డాన్సు చేసింది. వెయిటర్లతో కలిసి ఈ బ్యూటీ చేసిన డాన్సు దుమ్ము దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 

చిట్యాలలో ఓ ప్లాజా వద్ద రిలాక్స్ అయ్యేందుకు ఆగారు. అందులో వెయిటర్లు అనసూయ కోసం డాన్సులు చేశారు. ఆమెని కాసేపు ఎంటర్‌టైన్‌ చేశారు. ఆ తర్వాత ఇటీవల చాలా పాపులర్‌ అయిన మాస్‌ సాంగ్‌ `రా రా రక్కమ్మ ` పాటేసుకున్నారు. వెయిటర్లతో కలిసి తనదైన డాన్సు స్టెప్పులతో అదరగొట్టింది అనసూయ. రా రా రక్కమ్మ అంటూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

ఈ సందర్భంగా తీసిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకుంది అనసూయ. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అనసూయ మాస్‌ డాన్సుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రంగమ్మత్త రచ్చ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో అనసూయ టీషర్ట్ వైట్‌ జీన్స్ లో ఉండటం విశేషం. ఆమె ఫిగర్‌కి, మాస్‌ సాంగ్‌కి డాన్సు వేస్తే రచ్చ రంభోలా అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అనసూయ తన ట్రావెలింగ్‌ మధ్యలో ఇలా రిలాక్స్ కావడం విశేషం.
 

అనసూయ `జబర్దస్త్`ని వదిలేసిన విషయం తెలిసిందే. షో తన గుండెల్లో ఉంటుందని చెప్పిన ఆమె దాన్ని నిర్వహకులు, తనపై బాడీ షేమింగ్‌ కామెంట్లు చేసే ఆర్టిస్టులపై ఫైర్‌ అయ్యింది. విమర్శలు చేస్తూ షోని వదిలేసింది. `స్టార్ మా`లో ఆమె సూపర్‌ సింగర్‌ జూనియర్స్ షోకి హోస్ట్ గా చేసింది. ఆ సీజన్‌ పూర్తి కావడంతో ఇప్పుడు అనసూయ ఖాళీనే. 

అయితే సినిమాల పరంగా బిజీగా ఉంది. ఆమె చేతిలో దాదాపు పదికిపైగా సినిమాలున్నట్టు సమాచారం. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మలయాళంలో ఓ ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ చేయబోతుందట అనసూయ. 
 

ఇదిలా ఉంటే అనసూయ విషయంలో అసంతృప్తిగా ఫీలవుతున్నారు నెటిజన్లు. గ్లామర్‌ ఫోటోలు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె వద్ద టీవీ షోస్‌ లేకపోవడంతో ఫోటో షూట్‌ చేయలేకపోతుంది. దీంతో అభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఆమెని `జబర్దస్త్` షోలో, సోషల్‌ మీడియాలో మిస్‌ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వారికోసం గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుందేమో చూడాలి. 

click me!