మా ఎన్నికల యుద్ధం ముగిసింది. మా లో ఉన్నది కేవలం 900లోపు సభ్యులే అయినప్పటికీ ఎన్నికల హంగామా మాత్రం యుద్దాన్ని తలపించింది. గత రెండు నెలలుగా మా ఎన్నికల అంశం మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య విమర్శలు, కౌంటర్స్ తో హోరెత్తింది. చివరకు విష్ణు విజేతగా నిలిచాడు. 'మా' కొత్త ప్రెసిడెంట్ గా మారాడు.