మెగాస్టార్ పెద్ద మనసు.. వలస కూలీల కోసం 4 విమానాలు

First Published Jun 11, 2020, 2:38 PM IST

కరోనా వైరస్‌ కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం చేసింది.  మహహ్మారి భయంతో కేంద్ర ప్రభుత్వం సడన్‌గా లాక్‌ డౌన్ ప్రకటించటంతో లక్షలాది మంది వలస కార్మికులు పనిలేక సొంత గ్రామాలకు వెళ్లే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారిని రక్షించేందుకు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ వేలాది మందిని ఆదుకున్నాడు. వంద బస్సుల్లో దాదాపు 12000 మంది వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు పంపించటంతో పాటు ప్రతీ రోజూ వేలాది మందికి అన్నదానం చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా స్క్రీన్ విలన్‌ నుంచి రియల్ హీరో ఇమేజ్‌కు వచ్చేశాడు సోనూసూద్.
undefined
తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కూడా చేరిపోయాడు. బుధవారం దాదాపు 700 మంది వలస కార్మికుల కోసం నాలుగు ప్రత్యేక విమానాలను ఏరేంజ్‌ చేశాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఉంటున్న వారిని ఉత్తరప్రదేశ్‌లోని వాళ్ల సొంత ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాడు బిగ్ బీ.
undefined
మరో రెండు ఫ్లైట్స్‌ గురువారం బయలుదేరనున్నాయి. ముందుగా వలస కార్మికుల కోసం అమితాబ్ ట్రైన్‌ను బుక్ చేయాలని భావించాడు. కానీ పరిస్థితులు సహకరించకపోవటంతో విమానాలను బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఏర్పాట్లను ఏబీ కార్పోరేషన్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజష్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నాడు.
undefined
ఈ మేరకు రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల అమితాబ్ 300ల మంది వలస కూలీల కోసం పది బస్సులను ఏర్పాటు చేసి వారిని సొంత గ్రామాలకు చేర్చారు. లక్నో, అలహాబాద్‌, బదోహి లాంటి ప్రాంతాలకు ఈ బస్సులను పంపినట్టుగా ఆయన వెల్లడించారు.
undefined
ఈ సందర్భంగా సాయం పొందిన వలస కార్మికులు అమితాబ్‌ బచ్చన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఒక్కసారిగా లాక్‌ డౌన్‌ రావటంతో పనులు లేక ఇళ్లు చేరే మార్గం లేక ఇబ్బందుల్లో ఉన్న తమను బిగ్‌ బీ ఆదుకున్నాడని వెల్లడించారు.
undefined
click me!