ఇక దివంగత స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యానారాయణ వారసులుగా ఇద్దరు కొడుకులు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ వీవీ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో హీరోగా మారాడు. నాలుగైదు హిట్ సినిమాలు కూడా చేశాడు రాజేష్.
ఆతరువాత అడపాదడపా లీలామహల్ సెంటర్ లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన రాజేష్.. కొంత కాలానికి సినిమాల నుంచి కనుమరుగై పోయాడు. కొన్నాళ్ళు నిర్మాతగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ప్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆర్యన్ రాజేష్ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లరి నరేష్ మాత్రం కామెడీ హీరోగా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేశాడు.
నిర్మాత దగ్గుబాటి రామానయుడు వారసులుగా సురేష్ బాబు నిర్మాతగా సెటిల్ అయ్యారు, వెంకటేష్ స్టార్ హీరో అయ్యాడు. వారి వారసులుగా రానా దగ్గబాటి పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక వీరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి. అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్ లో అహింస సినిమా 2023 లో రిలీజ్ అయ్యి, డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి అభిరామ్ సినిమాలు చేయలేదు.