తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామం మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెంచేసిందనే వాదన మొదలైంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ నేరుగా తన మద్దతు ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీలో తీవ్ర అసహనానికి దారి తీసింది. సాయి ధరమ్ తేజ్ ఇటీవల ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు.