నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తోంది. ఒక గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, ఘాజి, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.