Akhanda 2 Collections: అఖండ 2 మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ మూవీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభం? ఎంత నష్టం అనేది చూస్తే.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ `అఖండ 2` థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ ఆ వసూళ్లని అందుకోవడంలో విఫలమయ్యింది. ఈ సినిమాకి ప్రారంభ షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. కాకపోతే మొదటిరోజు మంచి వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత మాత్రం డల్ అవుతూ వస్తోంది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతోంది.
25
`అఖండ 2 పది రోజుల కలెక్షన్లు
తాజాగా `అఖండ 2` పది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం మంచి వసూళ్లని రాబట్టింది. వీకెండ్లో కలెక్షన్లు పుంజుకున్నాయి. అంతకు ముందు కోటికిపైగా రాగా, ఈ శనివారం రెండున్నర కోట్లు, ఆదివారం మూడు కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. ఇక పది రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టింది. నెగటివ్ టాక్తోనూ వంద కోట్లు దాటింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లకుపైగా గ్రాస్ని సాధించిందని, రూ.72కోట్ల షేర్ని వసూలు చేసిందని టాక్.
35
అఖండ 2కి ఎంత నష్టం అంటే?
ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అనేది చూస్తే, ఈ మూవీకి రూ.115కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.43కోట్ల వరకు రావాలి. ఈ సినిమాకి ఇంకా నాలుగు రోజుల వరకు అవకాశం ఉంది. వీక్ డేస్ కావడంతో రోజుకి కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఎంత చేసినా ఇది రూ.80కోట్ల వరకు షేర్ రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా ఈ చిత్రానికి రూ.35-40కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
బాలకృష్ణ నటించిన ఐదు సినిమాలు వరుసగా వంద కోట్లు దాటుతున్నాయి. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` చిత్రాలు వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో `అఖండ 2` కూడా చేరింది. ఇలా సీనియర్లలో వరుసగా ఐదు వంద కోట్లు సాధించిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. కాకపోతే రెండు మూడు సినిమాలు ఫెయిల్యూర్గా మిగిలాయి. గత చిత్రం `డాకు మహారాజ్` కూడా నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు `అఖండ 2` కూడా అదే కోవలో చేరబోతుంది.
55
వాయిదా అఖండ 2ని దెబ్బకొట్టిందా?
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2` చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా నటించాడు. సంయుక్త, పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ 12న విడుదల చేశారు. వాయిదా పడటం కూడా ఈ మూవీకి పెద్ద మైనస్గా మారిందని చెప్పొచ్చు.