ఈ ఘటనపై బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ (Bigg boss Kaushal)స్పందించారు. ఆయన నిరసనకారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది దేశ ప్రజల సంపద. ఆ నష్టం అంతా మనమే మళ్ళీ టాక్స్ ల రూపంలో చెల్లించాలి. విషయం ఏదైనా ఇంత ఉన్మాదం, ఉక్రోషం పనికిరాదు. శాంతియుత పోరాటం కూడా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది, అంటూ కౌశల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.