మొన్న నయనతార.. నేడు కీర్తిసురేష్‌.. వ్యాక్సిన్‌ వివాదంలో ముద్దుగుమ్మలు..!

First Published May 24, 2021, 2:25 PM IST

గత వారం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వ్యాక్సిన్‌ వివాదంలో ఇరుక్కుని విమర్శలెదుర్కొంది. ఇప్పుడు `మహానటి` కీర్తిసురేష్‌ సైతం ఈ వ్యాక్సిన్‌ వివాదంలో ఇరుక్కుంది. వ్యాక్సిన్‌ వేయించుకుందా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

18ఏళ్లు పై బడిన వారు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వాటిని అమలు చేయడం లేదు. కానీ తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుంది.
undefined
గత వారం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వ్యాక్సినేషన్‌ చేయించుకుంది. తమిళ సినీ పరిశ్రమ కచ్చితంగా వ్యాక్సినేషన్‌ చేయించుకుంటేనే షూటింగ్‌లకు, సినిమా కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
undefined
దీంతో నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ చేయించుకుంది. విఘ్నేష్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. తమ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, మీరు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
undefined
undefined
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నయనతార వ్యాక్సినేషన్‌ చేసుకున్న తీరే వివాదాలకు కారణమైంది. నయనతార చేయికి నర్స్ ఇంజిక్షన్‌ లేకుండా కేవలం చేయితోనే ఇంజిక్షన్‌ ఇస్తున్నట్టుగా పోజ్‌ ఇచ్చింది. దీంతో ఇది పెద్ద దుమారం క్రియేట్‌ చేస్తుంది. నయనతార వ్యాక్సిన్‌ వేయించుకోలేదా? కేవలం యాక్షన్‌ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందా? అంటూ దుమ్మెత్తిపోతున్నారు నెటిజన్లు. ఇది పెద్ద వివాదంగా మారింది.
undefined
ఈ నేపథ్యంలో ఆదివారం కీర్తిసురేష్‌ సైతం ఫస్ట్ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, మీరు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇందులో ఆమెకి నర్స్ వ్యాక్సిన్‌ ఇస్తున్నప్పుడు ఇంజిక్షన్‌ కనిపించకుండా ఫోటో దిగింది.
undefined
నయనతారకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యాక్సినేషన్‌ని కవర్‌ చేసుకుందా? నిజంగానే వ్యాక్సిన్‌ తీసుకుందా? లేక నయన్‌ మాదిరిగానే ఫోటోకి పోజులిచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
undefined
ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో `సర్కారు వారి పాట`,`గుడ్‌ లఖ్‌ సఖీ`, `మరక్కర్‌ః అరబికడలింటే సింహాం`, `అన్నాత్తే`, `సాని కాయిధమ్‌`, `వాశి` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే నయనతార సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె `నెట్రికన్‌`, `అన్నాత్తే`, `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రానికి ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
click me!