నేను ప్రేమలో పడ్డాను... సంచలనం రేపుతున్న నటి సురేఖావాణి పోస్ట్!

First Published Apr 3, 2021, 3:43 PM IST

నటి సురేఖా వాణి సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నేను ప్రేమలో పడ్డాను అంటూ ఆమె ఓ ఫోటో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. రెండో పెళ్లి అంటేనే కస్సుమన్న సురేఖా, ప్రేమలో పడడం ఏమిటని విస్తుపోతున్నారు. 

చాలా కాలంగా సౌత్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగా సురేఖా వాణి ఉన్నారు. హీరో అక్క, వదిన పాత్రలతో పాటు.. హీరోయిన్స్ ఫ్రెండ్స్ రోల్స్ కి ఆమె బాగా ఫేమస్.
undefined
లేడీ కమెడియన్ గా కూడా పలు సినిమాలలో నవ్వులు పూయించారు సురేఖా వాణి.
undefined
ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ, బాద్షా, నమో వెంకటేశా, దుబాయ్ శ్రీను వంటి చిత్రాలలో సురేఖ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.
undefined
అయితే 2019లో సురేఖా జీవితంలో విషాదం చోటు చేసుకుంది . ఆమె భర్త సురేష్ తేజా అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. ఆ సమయంలో ఆమె సినిమాలు కూడా తగ్గించేశారు.
undefined
ఆ బాధ నుండి త్వరగానే కోలుకున్న ఆమె, టీనేజ్ కూతురుతో సరదాగా గడపడం మొదలుపెట్టారు. కూతురుతో కలిసి వీడియోలు చేయడం, ఫోటోలు దిగుతూ, వాటిని సోషల్  మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
undefined
ఈమధ్య సురేఖా వాణి రెండో పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు రావడం జరిగింది. మీడియాలో ఇది హాట్ టాపిక్ కావడంతో సురేఖా ఖండించారు. అలాగే ఆమె కూతురు సైతం మీడియాపై ఫైర్ అయ్యారు.
undefined
అలాంటిది సడన్ గా సురేఖా వాణి ప్రేమలో పడ్డాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే సురేఖా ప్రేమించింది వ్యక్తిని కాదట, తన మెడలో ఉన్న డైమండ్ నక్కిలీసు గొలుసునట.
undefined
ఓ బంగారు ఆభరణాల బ్రాండ్ స్టోర్ ప్రమోషన్ కోసం సురేఖా వాణి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసినట్లు అర్థం అవుతుంది. ఇక రీసెంట్ గా మాస్టర్ మూవీలో సురేఖా నటించడం జరిగింది.
undefined
click me!