నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖవాణి కూతురు సుప్రీత ఆవేదన

First Published Dec 5, 2023, 10:53 AM IST

నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు ఇలా వేదిస్తున్నారు.. నా అభిప్రాయం చెప్పడం తప్పా.. నన్ను మానసికంగా కృంగదీస్తున్నారు అంటూ.. నెటిజన్లపై మండి పడ్డారు.. నటి సురేఖావాణి కూతురు సుప్రీత. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  సురేఖావాణి గురించి అందరికి తెలిసిందే. ఆమె ఈమధ్య సినిమాలు తగ్గించింది. తన భర్త చనిపోయిన తరువాత తన కూతురితో ఉంటూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్  అయ్యింది. ఇద్దరు హాట్ హాట్ వీడియోస్ తో ఇన్ స్టా స్టోరీస్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక వీరి కొంత మంది సపోర్ట్ గా నిలబడగా.. మరికొంతమంది మాత్రం ఇద్దరిని ట్రోల్స్ చేస్తుంటారు. 
 

ఇక ఈ ఇద్దరు చేసే వీడియోలో ఔరా అనిపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ఉంటారు సురేఖ, సుప్రీత.  ఇక సుప్రీత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కూతురితో సమానంగా రీల్స్ చేస్తూ సురేఖావాణి కూడా నెట్టింట హంగామా చేస్తుంది. గతంలో షేర్ చేసిన వీడియోల కారణంగా తల్లీకూతుళ్లిద్దరూ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ  ఎన్నికలు, ఫలితాలతో మరోసారి హార్ట్ టాపిక్ అయ్యారు. 
 

Latest Videos


ప్రస్తుతం ఎన్నికల రిజల్ట్  నేపథ్యంలో సుప్రీత, ఆమె తల్లి సురేఖవాణిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఇద్దరు  సురేఖావాణి, సుప్రీత.. బీఆర్ఎస్ గెలవాలని కారు ముందు నిలబడి రీల్స్ చేసి సందడి చేశారు. ఆ రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. అందరికి గుర్తు ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాము కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

దాంతో ఇదే  అవకాశంగా తీసుకుని నెటిజన్లు రెచ్చిపోయి ట్రోల్ చేస్తున్నారు. దాంతో సురేఖ కూతురు సుప్రీత ఆవేదన చెందారు. వెంటనే సుప్రీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశా. మునుపటి ఇన్‌స్టా స్టోరీలో కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం ఏమిటి..  నేను మీకేం అన్యాయం చేశా.. నాపై ఎందుకింత ద్వేషం అన్నారు. 
 

అంతే కాదు మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా? అంటూ స్ట్రాంగ్ మెసేజ్ పెట్టారు  సుప్రీత. ఈ  పోస్ట్  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సుప్రీతకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. శుభాకాంక్షలు చెప్పడం తప్పుు ఎలా అవుతుంది. పార్టీలతో సబంధం లేకుండా.. ఎవరు ఎవరినైనా విష్ చేయవచ్చు కదా.. కెటీఆర్ అంతటి వారే.. కాంగ్రెస్ గెలపుకు శుభాకాంక్షలు తెలిపారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అంతే కాదు మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా? అంటూ స్ట్రాంగ్ మెసేజ్ పెట్టారు  సుప్రీత. ఈ  పోస్ట్  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సుప్రీతకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. శుభాకాంక్షలు చెప్పడం తప్పుు ఎలా అవుతుంది. పార్టీలతో సబంధం లేకుండా.. ఎవరు ఎవరినైనా విష్ చేయవచ్చు కదా.. కెటీఆర్ అంతటి వారే.. కాంగ్రెస్ గెలపుకు శుభాకాంక్షలు తెలిపారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

click me!