స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandann) టాలీవుడ్ చిత్రాలతోనే ఎదిగిన విషయం తెలిసిందే. ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి చిత్రాలు ఆమెను ఆడియెన్స్ కు బాగా దగ్గర చేశాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన ‘పుష్ప’తో ఏ రేంజ్ క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. శ్రీవల్లిగా రష్మిక ఇచ్చిన పెర్ఫామెన్స్ కు నేషనల్ క్రష్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ కు సీక్వెల్ గా వస్తున్న Pushpa 2 The Ruleలో నటిస్తోంది. రష్మిక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇది బిగ్ ఫిల్మ్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత రష్మిక మరింత పాపులారిటీని దక్కించుకోనుంది.