నటి మీనా వదులుకున్న బ్లాక్ బాస్టర్ ఫిల్మ్.. అప్పుడు గనుక ఆ పాత్రలో నటించి ఉంటేనా?

First Published Mar 25, 2024, 4:19 PM IST

నటి మీనా (Meena) తన కెరీర్ లో చేయాల్సిన ఓ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ను వదులుకున్నారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఆమె గనుక నటించి ఉంటే.. ఈరోజు లెక్కలు వేరేలా ఉండేవంటున్నారు.

Meena

సీనియర్ నటి మీనా (Actress Meena) తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే  20కి పైగా సినిమాలు చేశారు. 40 ఏళ్ల కిందనే వెండితెరకు పరిచయం అయ్యింది.

‘నవయుగం’ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 1990లో ఈ మూవీ విడుదలైంది. టాలీవుడ్ తోనే నటిగా తన కెరీర్ ప్రారంభమైందని చెప్పొచ్చు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీలోనూ పలు సినిమాలు చేసింది.

ముఖ్యంగా తెలుగులో మాత్రం.. సీతారామయ్య గారి మనవరాలు, చంటి, సుందరకాండ, అల్లరి మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి ప్రియుడు, బొబ్బిలి సింహం, సూర్య వంశం, మా అన్నయ్య, దృశ్యం, దృశ్యం2... వంటి గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది.

మీనా కెరీర్ లో ఇప్పటి వరకు 150వరకు సినిమాలు చేసి ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తున్నారు. నెక్ట్స్ మలయాళంలో ‘ఆనందపురం డైరీస్’, తమిళంలో ‘రౌడీ బేబీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మీనా కెరీర్ లో ఎవర్ గ్రీన్ ఫిల్మ్ ‘నర్సింహ’ను మిస్ చేసుకుంది. ఇందులో రమకృష్ణ కంటే ముందే మీనాను ‘నీలాంబరి’ పాత్రకు సంప్రదించారంట. కానీ అప్పటి పరిస్థితిలో వదులుకున్నారని తెలుస్తోంది.

కానీ మీనా గనుక ఈ చిత్రంలో నటించి ఉంటే మాత్రం ఇప్పుడు లెక్కలు వేరేలా ఉండేవని అంటున్నారు. ఇక మీనా మాత్రం ఎప్పుడూ బోల్డ్ సీన్లు ఉన్న పాత్రలకు ఓకే చెప్పలేదు. అందుకే పాత్రను వదులుకుందని తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించి రెండు దశాబ్దాల ఆడియెన్స్ ను మెప్పించింది. ఇప్పటికీ నీలాంబరి పాత్ర అంటే అందరికీ ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

click me!