నేనో బాధితురాలిని... కన్న తండ్రి మోహన్ బాబు మీద మంచు లక్ష్మి కీలక ఆరోపణలు!

First Published Jun 20, 2024, 9:12 PM IST


తాను నటించడం నాన్న మోహన్ బాబుకు ఇష్టం లేదన్న.. మంచు లక్ష్మి తన తమ్ముళ్లు విష్ణు, మనోజ్ లకు ఈజీగా దక్కినది తాను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని కీలక ఆరోపణలు చేసింది. నేను ఓ బాధితురాలిని అని మంచు లక్ష్మి అనడం కలకం రేపుతోంది. 

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె నటిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే హోస్ట్ గా కొన్ని టాక్ షోలు చేశారు. మంచు లక్ష్మికి ఆశించినంత గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె కల తీరలేదు. మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ఆడలేదు. 

వరుస ప్లాప్స్ తో మంచు లక్ష్మి ఇమేజ్ దెబ్బతింది. అయినప్పటికీ ఆమె సినిమాలు చేయడం ఆపలేదు.మంచు లక్ష్మి నిర్మాత కూడాను. తన బ్రదర్స్ తో కొన్ని సినిమాలు నిర్మించింది. ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రాలు కూడా తన బ్యానర్లోనే నిర్మితం అయ్యాయి. మంచు లక్ష్మి ఇటీవల అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. 

Latest Videos


తెలుగులో మంచు లక్ష్మికి బ్రేక్ రాలేదు. దీంతో ముంబై వెళ్లారు. కొద్దిరోజులుగా మంచు లక్ష్మి అక్కడే ఉంటుంది. బాలీవుడ్ లో రాణించాలి అనుకుంటున్నాని చెప్పింది. తాజాగా తండ్రి మీదే ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. తాను నటి కావడం తన తండ్రికి ఇష్టం లేదని ఆమె అన్నారు. 

మంచు లక్ష్మి మాట్లాడుతూ... నేను ముంబై వచ్చిన కొత్తలో రకుల్ ప్రీత్ ఇంట్లో ఉన్నాను. ఆమె ముంబై వచ్చేయ్ అని తరచూ చెప్పేది. అలాగే రానా కూడా నువ్వు ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండిపోతావా? అని అడుగుతూ ఉండేవాడు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబై వచ్చాను.

సౌత్ లో హీరోల కూతుళ్లకు, సిస్టర్స్ కి అవకాశాలు ఇవ్వరు. నేను నటి కావడం నాన్నకు కూడా ఇష్టం లేదు. నా ఇద్దరు బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే. ఈ ధోరణి సౌత్ లోనే కాదు, దేశమంతా ఉంది.. అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!