`పెళ్లి పుస్తకం` చిత్రంతో పాపులర్ అయ్యింది నటి దివ్య వాణి. అడపాదడపా మంచి సినిమాలు చేసింది. మెప్పించింది. కానీ తన నటనకు రేంజ్ గుర్తింపు రాలేదు. అడపాదడపా సినిమాలు చేసిన ఆమె కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అయితే `ఈగో`ల వల్ల చాలా ఆఫర్లు కోల్పోయినట్టు చెప్పింది దివ్య వాణి. చాలా సినిమాల్లో తనని సెలెక్ట్ చేసి తప్పించారని వాపోయింది.
దివ్యవాణి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఆమె ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతుంది. అందులో భాగంగా ఓ యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు షాకింగ్ విషయాలను పంచుకుంది. తనకు ఆఫర్లు మిస్ అయిన విషయాలను సైతం చెప్పింది. చాలా ఆఫర్లు కోల్పోయినట్టు తెలిపింది దివ్య వాణి. ఎంపిక చేసి తొలగించారని ఆవేదన చెందింది.
చిరంజీవితో `ఘరానా మొగుడు` చిత్రంలో తాను నటించాల్సి ఉందని చెప్పింది. వాణి విశ్వనాథ్ నటించిన పాత్రకి మొదట తననే తీసుకున్నారట. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తనని మధ్యలోనే తప్పించారని తెలిపారు. దానికి కారణం ఏంటో తెలియదని వెల్లడించింది. చిరంజీవి మంచి వారు అని, నిగర్వి, బాగా సపోర్ట్ చేస్తారని, మంచిగా మాట్లాడతారని, కానీ తనకే కలిసి రాలేదని చెప్పింది. ఆ తర్వాత `కొండవీటి దొంగ`లో తాను నటించినట్టు చెప్పింది దివ్య వాణి.
`కొండవీటి దొంగ`లో తాను మరదలి పాత్రలో నటించానని, అప్పటికీ తాను చిన్న అమ్మాయిని అని చెప్పింది. ఇందులో `శుభలేఖ రాసుకున్నా.. ` పాటలో తనేనటించాల్సి ఉందని, కానీ చిన్నమ్మాయి అని తొలగించారని తెలిపింది దివ్య వాణి. హీరో వరకు రీచ్ అవ్వాలంటే మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్లు ఇలా చాలా మంది ఉంటారు. వాళ్ల వాళ్ల ఉద్దేశ్యాలు వాళ్లకి ఉంటాయి, కానీ తాను చేయలేకపోయాను ఎందుకో అని చెప్పింది. ఆ కంపు అయిపోయింది, దాన్ని లోతుగా తోడుకోవడం ఎందుకని వెల్లడించింది.
తన నుంచి పోయిన వాటిలో `ప్రేమ ఖైదీ` సినిమా కూడా ఉందని చెప్పింది. అందులో పెయిరే మారిపోయిన్నట్టు పేర్కొంది దివ్య వాణి. ఇందులోనూ తాను హీరోయిన్ గా ఉండాలి, కానీ కుదరలేదు అంటూ నవ్వుతూ చెప్పింది. దాని వెనకాల ఏం జరిగి ఉంటుందో అనేది ఆమె తన నవ్వుతోనే చెప్పకనే చెప్పింది. ఇదే కాదు శ్రీకాంత్తో `ఆమె` సినిమా చేయాల్సింది. అప్పటికే ఆయనతో `దొంగ రాస్కెల్`సినిమా చేశాను కూడా. కానీ `ఆమె` సినిమా కూడా చేయాల్సింది. కానీ కుదరలేదని చెప్పింది దివ్య వాణి.
ఇలా చాలా సినిమాలు మిస్ కావడంతో, తనని నిజంగానే జనాలు మర్చిపోతారని, చిన్న పాత్రలు కూడా చేసేందుకు రెడీ అయినట్టు చెప్పింది. అలా తాను ఏ సినిమా చేసిన, ఏ పాత్ర చేసినా అందులో తన మార్క్ ఉండేలా నటించినట్టు చెప్పింది. అదే తనకు మంచి గుర్తింపు తెచ్చిందని, తన టాలెంట్తోనే అది సాధ్యమైందని చెప్పింది దివ్యవాణి.
ఈ సందర్భంగా బాలకృష్ణతో సినిమా మిస్ అయినదాని గురించి చెబుతూ, `బైరవ ద్వీపం` చిత్రంలో ఓ సాంగ్ కోసం తనని అప్రోచ్ అయ్యారట సింగీతం శ్రీనివాసరావు. `నరుడా ఓ నరుడా` అనే పాటకి తనని అడిగారట. కేవలం ఒక్కపాట కోసం ఏం చేస్తాం లే అని వదిలేసుకుందట. కానీ ఆ పాటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిందని, సినిమాని మించి ఆ పాటకిపేరొచ్చిందని, కానీ ఆ తర్వాత తాను చేయాల్సిందని, చాలా బాధపడినట్టు చెప్పింది దివ్య వాణి.