కాగా ఆచార్య (Acharya)కథ విషయానికి వస్తే.. పచ్చని, ప్రశాంతమైన అడవిలో ఉన్న పుణ్యక్షేత్రం ధర్మస్థలి. ఆ ఆలయాన్ని, అమ్మవారిని నమ్ముకొని పాద ఘట్టం ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. వారి ప్రశాంతమైన జీవితాలను స్వార్థపరుల వ్యాపార దాహం ఛిన్నాభిన్నం చేస్తుంది. అయితే వాళ్ళ ఆగడాలను ఆచార్య(చిరంజీవి) అడ్డుకుంటాడు. మరి ఆచార్యకు ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏమిటీ? ధర్మస్థలికి చెందిన సిద్ధ(రామ్ చరణ్) నక్సల్ గా ఎందుకు చేరాడు? అసలు సిద్ధ, ఆచార్య నేపధ్యాలు ఏమిటీ? వారు ధర్మస్థలిని దుర్మార్గుల బారి నుండి ఎలా కాపాడారు? అనేది మిగతా కథ