నిన్న ఐశ్వర్య.. నేడు అభిషేక్‌.. కోర్టు మెట్లెక్కిన బచ్చన్ ఫ్యామిలీ.. అసలేం జరిగింది?

Published : Sep 10, 2025, 04:32 PM IST

Abhishek Aishwarya Rai Bachchan: బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్‌, ఐశ్వర్యలు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఐశ్వర్య రాయ్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగింది? కోర్టుకు ఎందుకెళ్లారు ?

PREV
15
కోర్టు మెట్లు ఎక్కిన బచ్చన్ జంట

Aishwarya Abhishek Bachchan: బాలీవుడ్ లో స్టార్ కపుల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేంది. స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్- స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ జంటనే. గత కొన్నిరోజులుగా అభిషేక్‌, ఐశ్వర్యల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ పిటిషన్ దాఖలు చేసిన ఆ తరువాత రోజే ఆమె భర్త, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగింది? ఈ జంట కోర్టు మెట్లు ఎందుకు ఎక్కింది? 

25
అభిషేక్ పిటిషన్‌లో ఏముంది?

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడుకోవాలని, తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్, ప్రదర్శన వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకుండా ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

అభిషేక్ బచ్చన్ న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ ప్రకారం.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అభిషేక్ బచ్చన్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా నకిలీ వీడియోలు, ఫోటోలు, అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నాయని తెలిపారు.

AI (కృత్రిమ మేధస్సు) ద్వారా అభిషేక్ బచ్చన్ ఫోటోస్ వాడుతూ డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సంతకం, ఫోటోలను వాడి నకిలీ వస్తువులు, టీ-షర్టులు అమ్ముతున్నారని ఆరోపించారు. 

అభిషేక్ పిటిషన్‌ పై కోర్టు స్పందిస్తూ, అభిషేక్ టీమ్ స్పష్టమైన URL లింకులు అందిస్తే, గూగుల్‌ను ఆ కంటెంట్ తొలగించమని ఆదేశించవచ్చని చెప్పింది. అయితే, యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఒకేసారి ఆర్డర్ ఇవ్వలేమని, ప్రతి ప్రతివాదికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

35
ఐశ్వర్య రాయ్ కేసు ఏంటీ?

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఇలాంటి సమస్యలతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తన పేరు, ఇమేజ్, వాయిస్‌ను అనుమతి లేకుండా వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వాడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా తన ఫోటోలను క్రియేట్ చేస్తున్నారనీ, అశ్లీల వీడియోలు, ఫోటోలులో వాడటం ద్వారా ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

కొన్ని వెబ్‌సైట్లలో ఐశ్వర్య రాయ్ వాల్‌పేపర్లు, ఫోటోలు, అలాగే ఆమె చిత్రాలతో టీ-షర్టులు అమ్ముతున్నాయని కూడా గుర్తించారు. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని బెంచ్ ప్రతివాదులను హెచ్చరిస్తూ, ఈ దుర్వినియోగాన్ని ఆపడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చని సూచించింది.

45
అమితాబ్ బచ్చన్ కూడా

అభిషేక్ బచ్చన్ మాత్రమే కాదు, గతంలో ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. 2022లోనే అమితాబ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని కోర్టు మెట్లు లెక్కారు. దీంతో కోర్టు బిగ్ బీకి సానుకూలంగా స్పందించింది.

అమితాబ్ అనుమతి లేకుండా ఏ వ్యక్తి లేదా సంస్థ ఆయన పేరు, ఫోటోలు లేదా స్వరాన్ని వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అమితాబ్ పేరు, ఫోటోతో వస్తువులు అమ్మడం, వీడియోలు తయారు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 

అలాగే అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఫ్లాగ్ చేసిన కంటెంట్ ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూడా అదే దారిలో న్యాయపోరాటం చేస్తున్నారు.

55
అభిషేక్ – ఐశ్వర్య లవ్ స్టోరీ

అభిషేక్ – ఐశ్వర్య లవ్ స్టోరీ "గురు" సినిమా సెట్స్ లో మొదలైంది. ఆ తర్వాత "ధూమ్ 2"లో మరింత బలపడింది. ఇరువురి కుటుంబాలు ఒప్పుకోవడంతో ఈ లవ బర్డ్స్ 20 ఏప్రిల్ 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కొంతకాలం ఐశ్వర్య సినిమాల్లో వర్క్‌ చేశారు. 

2011లో ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్‌, ఐశ్వర్యల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories