నాన్ వెజ్ అంటే ఆయనకు మహా ప్రీతి. నాటు కోడిని ఇష్టంగా లాగించేవారట. మంచి బియ్యంతో చేసిన అన్నం, కోడికూర, పెరుగు, వెజ్ లో అయినా చారు, అప్పడం ఆయన మెనూలో ఉండాల్సిందే అని చెపుతారు. అయితే ఎన్టీఆర్ కొత్త ప్రాంతానికి వెళ్తే.. అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య యాత్రంలో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారు. సౌకర్యలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారక రామారావు.