ప్రతి ఏడాది 80కి చెందిన స్టార్లు రీ యూనియన్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. వారంతా కలిసి సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. తమ మధుర జ్ఞాపకాలను నెమరువేస్తుంటారు. ప్రతి ఏడాది ఒక్కో నగరంలో ఈ 80స్టార్ల రీయూనియర్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఒక్కో స్టార్ ఆతిథ్యం ఇస్తుంటారు.
ఈ ఏడాది ముంబయిలో జరిగింది. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ థ్రిల్హాన్ ఆతిథ్యం ఇచ్చారు. వీరంతా జాకీ ఇంట్లో సరదాగా గడిపారు. వీకెండ్ని ఎంజాయ్ చేశారు. తాజాగా ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రచ్చ చేస్తున్నాయి. అయితే ఈ ఇందులో డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఈ సారి ఆరేంజ్ డ్రెస్ కోడ్ ఫాలో అయినట్టు ఫోటోలను బట్టి చూస్తుంటే తెలుస్తుంది.
ఇక ఈ 80కి చెందిన స్టార్ల రీయూనియన్లో చిరంజీవి, వెంకటేష్, నరేష్, అర్జున్, శరత్ కుమార్, భాగ్యరాజ్, రాజ్ కుమార్, అనిల్ కపూర్, సన్నీ డియోల్, సంజయ్ దత్, భానుచందర్ ఉన్నారు. హీరోయిన్లలో రమ్యకృష్ణన్, సుహాసిని, ఖుష్బు, రాధా, సుమలత, శోభన, మేనక, పూర్ణిమా, లిస్సీ, సరిత, రేవతి, పూనమ్ దిల్హన్, నదియా, విద్యాబాలన్, టీనా అంబానీ, మధూ, పద్మిని, మీనాక్షి శేషాద్రి ఉన్నారు.
వీరంతా పార్టీలో నాన్ స్టాప్గా ఎంజాయ్ చేయడంతోపాటు అనేక మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సౌత్, నార్త్ సెలబ్రిటీలు ఉండటంతో అభిమానులంతా ఈ ఫోటోలను చూసి కనువిందుగా ఫీల్ అవుతున్నారు. ఈ సండేకిది బెస్ట్ ట్రీట్గా భావిస్తున్నారు.
ఇక చిరంజీవి ఇటీవల `గాడ్ ఫాదర్`తో మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `వాల్తేర్ వీరయ్య`, `భోళా శంకర్` చిత్రాల్లో నటిస్తున్నారు. వెంకటేష్ ఇటీవల `ఎఫ్3`లో అలరించారు. ప్రస్తుతం రానాతో కలిసి ఓ వెబ్సిరీస్ చేస్తున్నారు. నెక్ట్స్ సినిమాకి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారు.