2022 Tollywood Roundup: ఫుల్ కిక్ ఇచ్చిన కొత్త సరుకు... ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించి హీరోయిన్స్! 

First Published Dec 17, 2022, 3:13 PM IST

ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తారు. ఈ ఏడాది కూడా నార్త్ తో పాటు కన్నడ, మలయాళ భామలు టాలీవుడ్ అడుగుపెట్టారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు 
 

Tollywood Roundup 2022

2022 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఈ ఏడాది పరిశ్రమలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. పరిశ్రమలో చోటు చేసుకున్న కీలక సంఘటనలు ప్రస్తావనకు తెస్తున్నారు. కాగా టాలీవుడ్ లో ఈ ఏడాది అడుగుపెట్టిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.. 
 

Tollywood Roundup 2022


దర్శకుడు మహేష్ భట్ కూతురైన అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ గా వెలిగిపోతుంది. హీరోయిన్ గా మారిన పదేళ్ల తర్వాత అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇక ఇదే మూవీలో బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఒలీవియా ఎన్టీఆర్ కి జోడీగా చేశారు. 


బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, సయీ మంజ్రేకర్, అనన్య పాండే తెలుగు చిత్రాల్లో నటించారు. మృణాల్ ఠాకూర్ కి భారీ బ్రేక్ దక్కింది. ఆమె హీరోయిన్ గా నటించిన సీతారామం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అనన్య పాండే, సయీ మంజ్రేకర్ లకు మాత్రం నిరాశ మిగిలింది. వీరు హీరోయిన్స్ గా నటించిన లైగర్, గని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే సయీ మంజ్రేకర్ కి మేజర్ రూపంలో హిట్ తగిలింది. 

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను దగ్గరైన హీరోయిన్స్ లిస్ట్ లో కయాదు లోహర్, మిథిలా పార్కర్, గెహ్నా సిప్పి ఉన్నారు. శ్రీవిష్ణు హీరోగా అల్లూరి టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించారు. విశ్వక్ సేన్ కామెడీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఓరి దేవుడా మూవీలో అంతకు ముందు తెలుగు ప్రేక్షకులకు తెలియని మిథిలా పార్కర్ నటించారు. ఆకాష్ పూరి చోర్ బజార్ చిత్రంతో గెహ్నా సిప్పి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. గెహ్నా సుధీర్ గాలోడు మూవీలో నటించి హిట్ కొట్టారు. 
 

Samyukta Menon

మలయాళంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె రానా భార్య రోల్ చేశారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో మలయాళ భామ రజీషా విజయన్ తెలుగులో అరంగేట్రం చేశారు. అలాగే గాడ్సే చిత్రంతో ఐశ్వర్య లక్ష్మి తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Asha Bhatt

వీరితో పాటు హీరోయిన్ సౌమ్య మీనన్, కావ్యా శెట్టి, ఆశా భట్... తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన హీరోయిన్స్. ఈ ఏడాది తెలుగులో అడుగుపెట్టిన హీరోయిన్స్ లో చాలా మందికి కలిసి రాలేదు. అలియా భట్, ఒలీవియా మోరిస్, మృణాల్ ఠాకూర్ వంటి అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే విజయాలు నమోదు చేశారు. 
 

click me!