‘18 పేజెస్’ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్.. పుల్ జోష్ లో అల్లు అరవింద్, నిఖిల్, అనుపమా పరమేశ్వరన్!

First Published Dec 25, 2022, 2:34 PM IST

యంగ్ హీరో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ ‘18 పేజేస్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి క్రేజీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సక్సెస్ ను ప్రముఖ సెలబ్రెటీలతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

యంగ్ హీరో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ నటించిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘18 పేజేస్’ (18 Pages) తాజాగా థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని దూసుకుపోతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతోంది. 

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ.18 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అయితే నాన్ థియేట్రికల్ రన్ తోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. కేవలం ఓటీటీ రైట్స్ తోనే ప్రాఫిట్ లోకి వచ్చినట్టు సమాచారం.
 

ప్రపంచ వ్యాప్తంగా 845 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొత్తంగా రూ.12 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజెనెస్ చేసిందంట. దీంతో రూ.13 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసినట్టు అవుతోంది. ఈ క్రమంలో ఫస్ డేనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరోవైపు ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుందని మేకర్స్ కూడా ప్రకటించారు. 
 

బాక్సాఫీస్ పరంగా హిట్ కావడంతో ‘18 Pages’ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈవెంట్ కు  పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్, దర్శకుడు పరుశురామ్, వశిష్ట, బుచ్చిబాబు, చందూ మొండేటి హాజరయ్యారు. సెలబ్రేషన్స్ లో మరింత సందడి చేశారు. సక్సెస్ అందుకున్న ‘18 పేజెస్’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 

నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్ కు యంగ్ హీరోహీరోయిన్లు గా హాజరై ఈవెంట్ ను మరింత సక్సెస్ చేశారు. ప్రియాంక జవాల్కర్, సిమ్రాన్ చౌదరి, ప్రియ వడ్లమని హాజరయ్యారు. అలాగే ‘బేబీ’ టీమ్ నుంచి ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, విరాజ్ అశ్విన్ అటెండై ఈవెంట్ లో సందడి చేశారు. 
 

అనుకున్న విజయం సాధించడంతో ఈ చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది. రాత్రి ఈ చిత్ర యూనిట్ ప్రముఖ సెలిబ్రిటిస్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకోవడం నెట్టింట వైరల్ గా మారింది. అనుపమాతో అల్లు అరవింద్ చిందులు వేస్తున్న వీడియో కూడా ఆకట్టుకుంటోంది. చిత్రానికి  "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. 

click me!