లాక్‌ డౌన్‌ తరువాత అనసూయ చేసే ఫస్ట్ పని అదేనట!

First Published Apr 23, 2020, 4:06 PM IST

లాక్‌ డౌన్‌ కష్టాలు సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే 30 రోజులుగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ డెయిలీ రొటీన్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రెగ్యులర్‌ వర్క్‌ లేకపోవటంతో వర్క్‌ వీడియోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టైం పాస్‌ చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్‌ క్రేజీ యాంకర్‌ అనసూయ కూడా ఇదే పనిలో ఉంది.

సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే అనసూయ, లాక్‌ డౌన్‌లో మరింత యాక్టివ్‌ అయ్యింది. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది అనసూయ.
undefined
ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్‌ లాక్‌ డౌన్‌ తరువాత మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? అని అడగగా.. సెలూన్‌కి వెళ్లటం అని సమాధానం చెప్పింది అనసూయ.
undefined
మీ మీద వచ్చే ట్రోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు నాకు నే ఇంపార్టెంట్‌ మిగతాది అనవసరం అన్నట్టుగా సమాధానం చెప్పింది.
undefined
అంతేకాదు మీరు రోజు ఎంత సేపు జిమ్‌ చేస్తారు అంటూ అడగ్గా.. అసలు నేను జిమ్‌ లో ఇంతవరకు ఎప్పుడూ అడుగుపెట్టలేదు అంటూ సమాధానమిచ్చింది.
undefined
పర్ఫామెన్స్‌ చేసేప్పుడు ఒత్తిడికి లోనవుతారా అన్న ప్రశ్నకు స్టేజ్ ఎక్కిన ప్రతీ సారి నాకు అదే ఫీలింగ్ ఉంటుంది అని సమాధానం చెప్పింది అనసూయ.
undefined
మీ భర్తను తొలిసారి ఎప్పుడు కలిసారో గుర్తుందా? అన్ని అడగ్గా డేట్‌ గుర్తు లేదు కానీ ఏప్రిల్‌ 2001లో కలిసా అని చెప్పింది.
undefined
మీ ఇద్దరు పిల్లలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అని ప్రశ్నించగా ఇద్దరితో కలిసి నేను ఎక్కువ అల్లరి చేస్తా అని చెప్పింది.
undefined
ఎలాంటి దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడతారు. ట్రెడిషనలా లేదా వెస్ట్రన్‌ అని ప్రశ్నించగా.. కంఫర్ట్‌గా ఉండేది ఏదైనా వేసుకుంటా అని చెప్పింది.
undefined
తాజాగా అనసూయ తన కెరీర్ తొలినాళ్లలోని ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. తాను యాంకర్‌గా తొలిసారి కెమెరా ముందు కూర్చున్న సందర్భంగా తీసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటికీ ఇప్పటికీ అనసూయ గ్లామర్‌ లో ఎంతో చేంజ్‌ ఉందంటున్నారు నెటిజెన్లు.
undefined
click me!