రకుల్ పెద్ద మనసు.. 200 కుటుంబాలకు 2 రెండు పూటలా భోజనం

First Published Apr 6, 2020, 10:18 AM IST

కరోనా వైరస్‌ మానవ జాతి మీద పగ పట్టినట్టుంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు ఎవ్వరూ గడప దాటలేని పరిస్థితి. ఉన్నత వర్గాలు ఈ పరిస్థితిని తట్టుకోగలిగినా.. రోజు వారీ కూలీలు, పేద ప్రజల పరిస్థితి మాత్రం దుర్బరంగా మారింది. అయితే ఈ కఠిన పరిస్థితుల్లో అలాంటి వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్‌ కూడా ఈ లిస్ట్ లో చేరింది.

రకుల్ ప్రీత్ సింగ్ బస్తీలో నివసించే రోజువారి కూలిలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. గురుగ్రామ్‌ లోని తన ఇంటికి సమీపంలో ఉండే కాలనీలోని 200 పేద కుటుంబాలను ఆదుకునేందుకు నేను సైతం అంటూ ముందుకు వచ్చింది.
undefined
తన పేరెంట్స్‌తో కలిసి ఓ బస్తీలో ఉంటున్న 200 కుటుంబాలకు తన ఇంట్లోనే భోజనాల వండి పంపిస్తోంది. ప్రతీ రోజూ ఈ ఇలాగే పంపిస్తోంది రకుల్‌.
undefined
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ `మా నాన్న కాలనీలో కనీస అవసరాలు కూడా తీరని పేదల వివరాలను సేకరించాడు. వారికీ ప్రతి రోజూ రెండు పూటలా భోజనం అందిస్తున్నాము.
undefined
ఈ లాక్‌ డైన్‌ కొనసాగినంత కాలం ఇలాగే భోజనం పంపించాలని నిర్ణయించాం. ఒక వేళ ఈ పరిస్థితులు మరింత కాలం కొనసాగితే మేం కూడా మా సాయాన్ని పొడిగిస్తాం` అని వివరించింది రకుల్‌.
undefined
`మనందరం ఒక విషయాన్ని గమనించాలి. మనం చాలా సుఖంగా ఉంటున్నాం. మనకు ఇళ్లు, సాయం, ఆహారం తో పాటు ఎమర్జెన్సీలో స్టాక్‌ చేసుకునే స్థోమత కూడా ఉంది.
undefined
అయితే ఇప్పుడు మనం సమజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం. మనం సాయం చేసిన వారు తింటున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందానికి మించినది ఏం లేదు` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది రకుల్‌.
undefined
ఇక ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్ సింగ్‌కు ఈ మధ్య అవకావాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ, హిందీ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం మూడు హిందీ, రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.
undefined
click me!