Pawan Kalyan: పవన్ కళ్యాణ్‎కు దగ్గు, వైరల్ ఫీవర్, ఇప్పుడెలా ఉంది?

First Published Sep 6, 2024, 8:18 AM IST

 ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులు అంతా జ్వరాలతో బాధపడుతున్నారని సమచారం. 

Deputy CM Pawan Kalyan

 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  వైరల్ ఫీవ‎ర్‎తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులు అంతా జ్వరాలతో బాధపడుతున్నారని సమచారం. ట్రీట్మెంట్ జరుగుతోందని, మెల్లిగా కోలుకుంటున్నారని , వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలుస్తోంది.

Deputy CM Pawan Kalyan

ఇక హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద సహాయ చర్యలపై మునిగారు. రెండు రోజులు అధికారులతో సమీక్షలు చేశారు. వర్షాలతో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇక డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా సమీక్ష చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అధికారులకు ఆదేశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

Latest Videos


Deputy CM Pawan Kalyan

ఆంధ్రా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం నుంచి కొంత అస్వస్థతకు లోనయ్యారని సమాచారం. బుధవారం కొంత అవస్థ పడగా.. గురువారం మరింత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అస్వస్థతకు గురయినప్పటికీ  తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. 

 అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపు విశ్రాంతి పొందుతున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిసింది.
 

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.6 కోట్లు విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏపీలో నిన్న చెప్పిన విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇక, తెలంగాణకు పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీకి కోటి, తెలంగాణకు కోటి, పంచాయతీలకు 4 కోట్లు.. మొత్తం కలుపుకుని రూ.6కోట్లు విరాళంగా ఇచ్చారు పవన్ కల్యాణ్.

click me!