మన ఊరికి కరోనా వస్తే.. అంతపెద్ద ఫిగారా అది.. నాగబాబుపై విమర్శల వర్షం!

First Published Mar 15, 2020, 3:13 PM IST

మెగా బ్రదర్ నాగబాబు కొన్ని నెలల క్రితం జబర్దస్త్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక నాగబాబు ఓ ప్రముఖ ఛానల్ లో 'అదిరింది' అనే షో ప్రారంభించారు.

మెగా బ్రదర్ నాగబాబు కొన్ని నెలల క్రితం జబర్దస్త్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక నాగబాబు ఓ ప్రముఖ ఛానల్ లో 'అదిరింది' అనే షో ప్రారంభించారు. మొదట్లో ఈ కామెడీ షోకు అంతగా రెస్పాన్స్ రాలేదు. టిఆర్పి రేటింగులు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
undefined
కానీ ప్రస్తుతం నెమ్మదిగా ఈ షో పుంజుకుంటోంది. ఇటీవల అదిరింది షో నుంచి యాంకర్ సమీరాని తప్పించారు. ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ, ప్రముఖ యాంకర్ రవిని యాంకర్స్ గా రీసుకున్నారు. భానుశ్రీ.. అనసూయ, రష్మీ తరహాలో గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
undefined
ఇక అదిరింది స్కిట్ లలో కూడా జబర్దస్త్ ఫార్ములా ఫాలో అవుతూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనితో క్రమంగా అదిరింది షో కూడా జనాల్లోకి వెళుతోంది. ఇదిలా ఉండగా ఎలాంటి జోక్ అయినా జబర్దస్త్ లో నాగబాబు, రోజా పగలబడి నవ్వుతూ కనిపించేవారు.
undefined
అదిరిందిలో కూడా నాగబాబు ఇదే ధోరణ అవలంబిస్తున్నారు. అదిరింది షోలో కమెడియన్లు వేసిన ఓ కుళ్ళు జోకు, దానికినాగబాబు నవ్వడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
undefined
ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని అదిరింది టీం విడుదల చేసింది. ఈ ప్రోమోలో కమెడియన్ సద్దాం వేసిన కుళ్ళు జోకు చికాకు పుట్టించేలా ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలని కరోనావైరస్ వణికిస్తోంది. వేల సంఖ్యలో ఇప్పటికే ఈ వైరల్ బారీన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
undefined
ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో సద్దాం కరోనాపై జోకులు వేశాడు. స్కిట్ లో భాగంగా ఓ కమెడియన్ వచ్చి.. చైనా నుంచి హైదరాబాద్ కు కరోనా వచ్చిందట..కరోనా .. అది కనుక మన ఊరికి వస్తే అందరు పడిచస్తారు అని అంటాడు.. దీనికి సద్దాం.. అంత పెద్ద ఫిగారా అది అనిఅంటాడు. ఓహో అది కరీనా కాదు కరోనా అని చెప్పడంతో.. అది నాకు తెలుసు.. కరీనా అంటే బాలీవుడ్ హీరోయిన్. కరోనా అంటే చైనాది అంటూ కుళ్ళు జోకులు వేస్తాడు.
undefined
ఈఎపిసోడ్ కు నాగబాబు పగలబడి నవ్వుతూ కనిపిస్తాడు. ఇలాంటి సమయంలో కరోనాపై జోకులు వేయడం ఏంటో.. దానికి నాగబాబు నవ్వడం ఏంటో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతూ నాగబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
undefined
అలాగే నాగబాబు కరోనాపై స్పందిస్తూ ఇటీవల చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. కొన్ని మతాలవాళ్ళు వాళ్ళ దేవుడే కరోనా వైరస్ ని భూమ్మీదికి పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా' అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
undefined
click me!