' అశ్వత్థామ' వివాదం : దారుణం,పద్దతి కాదంటూ ఘాటుగా మెహ్రీన్!

First Published Feb 25, 2020, 9:40 AM IST

ఈ విషయమై మీడియాలో రావటానికి కారణం... ఆ చిత్ర నిర్మాతలు కొన్ని టాబ్లాయిడ్ వెబ్సైట్స్ కి ఉప్పు అందించమే అంటున్నారు. దాంతో వాళ్ళు  మెయిన్ హెడ్డింగ్ లు  పెట్టి మెహ్రీన్ ని దారుణంగా చిత్రీకరించారు. అయితే ఈ విషయం మెహ్రీన్ కెరీర్ ని దెబ్బ తీసేలా ఉంది.

నాగశౌర్య...తాజా చిత్రం అశ్వద్ధామకు సంభందించి లాండ్రీ బిల్, భోజనం బిల్ వివాదం పెద్దదవుతోంది. ఈ విషయంలో హీరోయిన్ మెహ్రీన్ పేచీ పెట్టిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ‌శౌర్య హీరో తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా.. త‌ల్లి ఉష నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర‌కు ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేదు. ఈ విషయమై మీడియాలో రావటానికి కారణం... ఆ చిత్ర నిర్మాతలు కొన్ని టాబ్లాయిడ్ వెబ్సైట్స్ కి ఉప్పు అందించమే అంటున్నారు. దాంతో వాళ్ళు మెయిన్ హెడ్డింగ్ లు పెట్టి మెహ్రీన్ ని దారుణంగా చిత్రీకరించారు. అయితే ఈ విషయం మెహ్రీన్ కెరీర్ ని దెబ్బ తీసేలా ఉంది.
undefined
నిజంగానే మెహ్రీన్ అంత దారుణంగా ప్రవర్తించిందా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. ఈ విషయమై వెంటనే క్లారిఫికేషన్ ఇవ్వకపోతే తన ఆఫర్స్ ఇది ప్రభావం చూపెడుతుందని ఆమెకు అర్దమైంది.దాంతో ఈ వ్యవహారంలో మెహ్రీన్ వెర్షన్ చెప్పాలనుకుంది. అయితే దానిని మీడియా ముందుకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా మెహ్రీన్ ఒక పెద్ద ట్వీట్ రూపంలో విషయం చెప్పింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటి...ఆమె ఇచ్చిన వివరణ ఏమిటి చూద్దాం.
undefined
యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ‘అశ్వథ్థామ’ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని నిర్మించింది కూడా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్. అయితే ఆమె స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్మాతల పే చేయలేదంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ లీకులిచ్చింది ఈ ముద్దుగుమ్మే అని కొందరన్నారు. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.
undefined
‘అశ్వథ్థామ’ సినిమా కోసం మెహ్రీన్‌కు రూ. 65 లక్షల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట. అందులో రూ. 55 లక్షలు సినిమాకు ముందే ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మిగతా రూ. 10 లక్షల సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని నిర్మాణ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.
undefined
కాగా సినిమా కంప్లీట్ అయ్యాక ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రమోషన్స్‌కు రాలేదు మెహ్రీన్. దీంతో నిర్మాతలు ప్రమోషన్స్‌కి రాకపోతే ఎలా అని కాస్త ఫైరయ్యారట. దాంతో ప్రొడ్యూసర్స్ హోటల్ కోసం, ఇతరత్రా ఖర్చులు కోసం సెటిల్ చెయ్యాల్సిన బిల్ల్లులను ఆపు చేసేసారు.
undefined
తనకి కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రచారం చేసానని, ఒకసారి స్కిన్ రాష్ కారణంగా ఒక ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోయానని, దానికే సదరు నిర్మాణ సంస్థకు కోపం వచ్చి తన హోటల్ బిల్ చెల్లించడానికి నిరాకరించారని, దాంతో ఆ బిల్లులు తన సొంత డబ్బుతో క్లియర్ చేసానని, మెహ్రీన్ చాల ఘాటుగా ట్వీట్ చేసింది.
undefined
“నా సంక్రాంతి విడుదల ప్రమోషన్లను ముగించిన తరువాత, నేను పంజాబ్‌లోని నా కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాను. చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందు నేను ప్రమోషనల్ వర్క్ చేయడానికి హైదరాబాద్ తిరిగి వచ్చాను. మా తాతగారికి గుండెపోటు రావడం వల్ల నేను హైదరాబాద్ వచ్చేందుకు కొంత సమయం ఆలస్యమైంది. ఈ విషయాన్ని నా సహనటుడు నాగ శౌర్య ఇంటర్వ్యూల సందర్భంగా కూడా ప్రస్తావించారు.
undefined
తిరిగి వచ్చిన తర్వాత నేను అశ్వథామ కోసం అన్ని ప్రమోషన్లలో పాల్గొన్నాను. నాకు స్కిన్ అలెర్జీ వచ్చి..ముఖం దద్దుర్లు రావడంతో ఒక ఒక ఇంటర్వ్యూలో పాల్గొనలేకపోయాను. అందుకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫోటోను నిర్మాతలకు పంపి..క్షమాపణ కోరాను.
undefined
అయినా కూడా నిర్మాతలు నా హోటల్ బిల్లును కట్టడానికి నిరాకరించారు. నా సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించలేదు. దాంతో వెంటనే నేను నా మేనేజర్ కు చెప్పి హోటల్ బిల్, స్టాఫ్ బిల్ కట్టించాను.
undefined
కాని ప్రస్తుతం సర్కులేట్ అవుతోన్న వార్తలు నన్ను చాలా బాధకు గురిచేశాయి. నేను ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 14 చిత్రాలలో పనిచేశాను. కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా కోసం వాటన్నింటిని దాటి వచ్చాను. ఇప్పటివరకు పనిచేసిన ఏ సంస్థతో కూడా నాకు ఫైనాన్సియల్ డిఫరెన్సెస్ లేవు.
undefined
కొన్ని ఆర్టికల్స్‌లో నా హోటల్ బిల్లులు, ఆహారం, లాండ్రీ బిల్లులు ప్రస్తావించం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా, నా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పారితోషికంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది నేరుగా ప్రొడక్షన్ హౌస్‌తో జరుగుతుంది. ప్రతి కాయన్‌కి రెండు వైపులు ఉంటాయి.
undefined
నాకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని కించపరుస్తున్నప్పుడు..సైలెంట్‌గా ఉండలేను. అశ్వథామ చిత్రంలో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐరా క్రియేషన్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలు సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఇకపై ఈ విషయం గురించి నేను ప్రస్తావించాలనుకోవడం లేదు” అని మెహ్రీన్ సోషల్ మీడియాలో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
undefined
ఎప్పుడూ వివాదం ఎరుగని హీరోయిన్ ఇంత ఘాటుగా స్పందించడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ చిత్తాన్ని నిర్మించిన నాగ శౌర్యని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయమై నాగ శౌర్య ఏ విధంగా స్పందించబోతున్నారో చూడాలి. రీసెంట్ గా ఛలో కథ నేను రాసిందే అని, కానీ పేరు వేసుకోలేదని అన్నారు. చివరకు అశ్వద్దామ వర్కవుట్ కాకపోవటం, భీష్మ పెద్ద హిట్ అవటంతో నాగ శౌర్య ని అందరూ ఈ విషయమై ట్రోల్ చేస్తున్నారు.
undefined
click me!