ఇళయరాజాకు ఆలయంలో అవమానం?

Published : Dec 16, 2024, 10:41 AM IST

సంగీత దిగ్గజం ఇళయరాజా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆలయ అర్థ మండపంలోకి ఆయనను అనుమతించలేదని, ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన కాపీరైట్స్, వైరముత్తుతో వివాదం వంటి వార్తల్లో నిలిచారు.

PREV
15
ఇళయరాజాకు ఆలయంలో అవమానం?
Ilayaraja Music


 సంగీత దిగ్గజం ఇళయరాజా(Ilayaraja)  గురించి ప్రత్యేకంగా ఎవరకీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయనొక శిఖరంగా అభివర్ణిస్తారు. 80, 90 దశకాల్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో అద్బుతమైన పాటలని అందించాడు ఇళయరాజా.  కొంత కాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఆయన. అయినా ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. మరో ప్రక్క  ఇటీవల ఈయన పేరు  నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్‌ కోరుతున్న విషయం విధితమే.  తాజాగా ఆయనకు తమిళనాడులోని ఓ ఆలయంలో అవమానం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

25
Ilayaraja Songs


వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి సంగీత దర్శకుడు ఇళయ రాజాను ఆపి బయటకు పంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఈరోజు ( డిసెంబర్ 16న) మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పెళ్లికాని యువతులు ఉదయాన్నే  నిద్రలేచి, స్నానం చేసి, సమీపంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్లి, ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు పాడుతూంటారు.  శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో కూడా ఈ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఈరోజు ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు. 

35
Music Director Ilayaraja


ఈ సందర్భంగా సంగీత విద్వాంసుడు ఇళయరాజా మార్గశిర తొలిరోజు ఆండాళ్‌ను దర్శించుకునేందుకు తెల్లవారుజామున శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. స్వరకర్త ఇళయరాజా స్వామివారి దర్శనం కోసం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న జీయర్ ఆయనను అడ్డుకున్నారు. దీంతో అర్థ మండపం మెట్ల దగ్గర నిలబడి ఇళయరాజా ఆలయ మర్యాదలను స్వీకరించారు.

45
Ilayaraja


 శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి సంగీత విద్వాంసుడు ఇళయరాజాను రానివ్వక పోవడం కలకలం సృష్టించింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

55
Ilayaraja


ఇక రీసెంట్ గా అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా  ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేస్తే వైరల్ అయ్యింది. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు.  తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు.

click me!

Recommended Stories