Keerthy Suresh: కళ్లావి ఓ `ఐరన్‌లెగ్` కళావతి.. కీర్తిని కాపాడబోయి నట్టేట మునిగిన మహేష్‌

Published : May 12, 2022, 06:45 PM ISTUpdated : May 12, 2022, 06:51 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫలితాలతో కీర్తి కేరీర్ భవిష్యత్ లో అయోమంగా కనిపిస్తోంది.    

PREV
18
Keerthy Suresh: కళ్లావి ఓ `ఐరన్‌లెగ్` కళావతి.. కీర్తిని కాపాడబోయి నట్టేట మునిగిన మహేష్‌

దర్శకుడు పరశురాం పెట్ల, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కారు వారి పాట’ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. మిశ్రమ స్పందనతో మొదటిరోజే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపైనే కీర్తి సురేష్ బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఫలితం తన కేరీర్ పై  ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ కేరీర్ ను ఒకసారి పరిశీలిస్తే..
 

28

 చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను ప్రారంభించిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) తెలుగులో తొలుత ‘నేను శైలజా’ చిత్రంలో నటించింది. రామ్ పోతినేని సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులకు కాస్తా మెప్పించగలిగింది. ఆ తర్వాత నాని ‘నేను లోకల్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. 
 

38

అయితే ఆ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఓ మోస్తరుగానే ఆడాయి. దీంతో కేరీర్ ప్రారంభంలోనే కీర్తి సురేశ్ కు పెద్దగా ఫలితం అందలేదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు తమిళ చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేశ్ కు ఒక్కసారిగా ‘మహానటి’ చిత్రంతో  అదృష్టం వరించింది. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’ (Mahanati). 
 

48

ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీర్తి నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇందుకు గాను 2019లో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. దీంతో టాలీవుడ్ లో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన కేరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా ‘మహానటి’ అనే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ముందు, తర్వాత ఇలాంటి సక్సెస్ ను చూడలేకపోయింది కీర్తి. సినిమా ఆఫర్లు వస్తున్నా.. అన్నీ డిజాస్టర్ ఫలితాలు, మిశ్రమ స్పందనతో తన కేరీర్ ను వెనక్కి నెడుతున్నాయి.    
 

58

ఆ తర్వాత ‘మన్మధుడు 2, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలేవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ‘మహానటి’ క్రేజ్ కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అయితే తను ఎంచుకుంటున్న పాత్రలే ఇందుకు కారణం అంటూ సినీ ప్రముకులు అంటున్నారు. సినిమాల ఎంపికలో అజాగ్రత్త వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. 
 

68

చివరిగా ఈ రోజు రిలీజ్ అయిన ‘సర్కారు వారి పాట’తోనైనా కేరీర్ మలుపు తిరుగుతుందని భావించిన కీర్తికి నిరాశే మిగిలించింది. కనీసం మహేశ్ బాబుతోనైనా తనకు కలిసి వస్తుందని ఆశించింది. తీరా మహేష్‌ బాబు.. కీర్తిసురేష్‌కి సక్సెస్‌ ఇవ్వబోయి నట్టేట మునిగాడు. దీంతో సర్కారు వారి పాటతో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందే ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేయటాన్ని మహేశ్ బాబు ఫ్యాన్స్ వ్యతిరేకించారు. కానీ కీర్తి ఈ సినిమాలోనే గ్లామర్ కూడా ఎక్కువగా ఒళకబోసింది.. అయినా ఫలితం లేకుండా పోయింది.    
 

78

అలాగే కీర్తి గతంలో ‘గాంధారి’ టైటిల్ తో బీగ్రేడ్ మ్యూజిక్ వీడియోలో నటించి తన పాపులారిటీని మరింత తగ్గించుకుంది. ఓపక్క స్టార్స్ హీరోల సరసన నటిస్తూ.. ఇలాంటి వీడియోల్లో నటించడం పట్ల ఆడియెన్స్ కీర్తిపై మండిపడ్డారు.  ‘గుడ్ లక్ సఖి’ మూవీ రిలీజ్ అప్పటి నుంచే నెటిజన్లు కీర్తిపై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ డిజాస్టర్ ఫలితానివ్వడంతో  ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేస్తున్నారు. తనతో ఏ స్టార్ సినిమా తీసినా ప్లాఫ్ మూటగట్టుకోవాల్సిందేనంటూ అభిప్రాయపడుతున్నారు. 
 

88

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’చిత్రాల్లో సిస్టర్ రోల్స్ లో నటించడం తన కేరీర్ కు పెద్ద మెనస్ అనే చెప్పాలి. దీంతో టాప్ డైరెక్టర్స్ ఎవరూ కీర్తివైపు చూడటం లేదు. దీంతో కీర్తి కేరీర్ అయోమంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి చేతులో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ మూవీ మాత్రమే మిగిలి ఉంది.  
 

click me!

Recommended Stories