మోదీ దెబ్బకి ఇరుక్కున్న నాగబాబు.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు..!

First Published Mar 4, 2020, 11:06 AM IST

మోదీ పెట్టిన ట్వీట్ పై పలువురు రాజకీయ నాయకులు, సెల్రబెటీలు స్పందిస్తున్నారు. తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంపై  నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. 

తాను సైతం ప్రధాని మోదీ దారిలో ప్రయాణించాలనుకుంటున్నట్లు మెగా బ్రదర్ ప్రకటించారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... తాను వాటినుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన ప్రకటించారు.
undefined
మోదీ పెట్టిన ట్వీట్ పై పలువురు రాజకీయ నాయకులు, సెల్రబెటీలు స్పందిస్తున్నారు. తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంపై నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు. 'మోదీజీ నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను. నేనూ మోదీజీని ఫాలో అవ్వాలనుకుంటున్నాను' అని ప్రకటించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.
undefined
నాగబాబు స్పందనకు భారీగా ప్రతిస్పందన వచ్చింది. 'బై అన్న.. హ్యాపీ' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మోదీజీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు, గమనించలేదా కొందరు రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు అదిరింది షో జడ్జ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొవడం వల్లే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసుంటాడని చాలా మంది భావిస్తున్నారు.
undefined
ఇక సోషల్ మీడియాను వదిలేస్తానని ట్వీట్ చేసి సంచలనం రేపిన ప్రధాని నరేంద్ర మోదీ మరో ట్విస్ట్ ఇచ్చారు. తానెందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తాను అన్న విషయం వివరణ ఇచ్చారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు.
undefined
‘ఆదివారం రోజు.. మహిళా దినోత్సవం. మనల్ని ఇన్‌స్పైర్ చేస్తున్న మహిళలకు నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగిస్తా. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs‌తో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.
undefined
దాంతో నాగబాబు ఇప్పుడు తాను అన్నమాట ప్రకారం సోషల్ మీడియాను వదిలేస్తారా లేక కొనసాగుతాడా లేదా అన్నది పెద్ద చర్చగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జన సేన వ్యతిరేకులు చాలా మంది ఈ విషయమై మీరు కూడా మళ్ళీ మోదీనే ఫాలో అవుతారా...లేక సోషల్ మీడియాను వదిలేసి వెళ్లిపోతారా అంటూ ట్యాగ్ చేసి మరీ సెటైర్స్ వేస్తున్నారు.
undefined
click me!