జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత అన్ని చిత్ర సీమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న విషయం తెలిసిందే. ఫిలిమ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండటం, వారు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మళయాళంలో సిద్దిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్ పై కేసులు నమోదు కాగా, హీరో నివిన్ పౌలీపై సైతం కేసు నమోదయింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైందనిపిస్తోంది.