ఫేక్‌ న్యూస్‌ వివాదం.. అనసూయ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

First Published May 5, 2020, 10:39 AM IST

యాంకర్‌ అనసూయ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రాత్రి `మనవరకు వస్తే కానీ బుద్ది రాదన్న మాట.. మ్‌మ్‌..` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ విజయ్‌ మొదలు పెట్టి  ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.

సోమవారం విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేసిన వీడియో మెసేజ్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్ చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ విజయ్ దేవరకొండ ఓ పెద్ద యుద్ధమే ప్రకటించాడు.
undefined
ప్రస్తుతం #KillFakeNews #KillGossipWebsites అనే హ్యాష్ ట్యాగ్స్‌ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయంలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు అందరికన్నా ముందే విజయ్‌ కి మద్దతు పలకటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ ప్రముఖులంతా విజయ్‌కు మద్దతుగా ట్వీట్ లు చేశారు.
undefined
అయితే ఈ సమయంలో యాంకర్‌ అనసూయ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రాత్రి `మనవరకు వస్తే కానీ బుద్ది రాదన్న మాట.. మ్‌మ్‌..` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ విజయ్‌ మొదలు పెట్టి ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.
undefined
గతంలో అనసూయ మీద చాలా రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. ఆ సమయంలో అనసూయ ఒంటరిగానే వాటిని ఎదుర్కొంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద సపోర్ట్ రాలేదు. కొన్ని సందర్భాల్లో అనసూయ మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
undefined
ఆ ఉద్దేశంతోనే అనసూయ ఇప్పుడు ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. గతంలో తనకు మద్దతుగా రాని వారు. ఇప్పుడు వారి దాకా వచ్చే సరికి పోరాటాలు మొదలు పెట్టారన్న ఉద్దేశంతోనే అనసూయ ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. అయితే ఈ ట్వీట్ పై మహేష్, విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
undefined
అనసూయను ఆంటీ అని సంబోదిస్తూ.. నువ్వు ఈ కష్టకాలంలో ఒక్క రూపాయి అయినా సాయం చేశావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
undefined
click me!