టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్ని ఎంపిక చేయకపోవడం ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశంగానే మిగిలింది. పొట్టి ఫార్మాట్కి దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ని టీ20 ఫార్మాట్లోకి తిరిగి తీసుకొచ్చిన సెలక్టర్లు, నాలుగేళ్లుగా వైట్ బాల్ ఫార్మాట్లో టీమ్కి ప్రధాన స్పిన్నర్గా ఉంటూ వచ్చిన చాహాల్ని పూర్తిగా పక్కనబెట్టేశారు..