అశ్విన్ అవసరం, జడేజా మ్యాచ్ విన్నర్... ఫైనల్‌లో ఇద్దరూ ఉండాల్సిందే... - వీవీఎస్ లక్ష్మణ్...

First Published Jun 16, 2021, 9:42 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టును ఎక్కువగా వేధిస్తున్న సమస్య తుదిజట్టు ఎంపిక. తుది 15 మంది జట్టును ప్రకటించినా వారిలో బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం టీమిండియాకి అతిపెద్ద సమస్యగా మారింది.

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్నర్లుగా 15 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగడం అవసరమా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
undefined
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు కల్పించి, రవీంద్ర జడేజా బదులు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌గా హనుమ విహారిని ఆడించాలని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.
undefined
అయితే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఫైనల్‌లో ఈ ఇద్దరూ తుదిజట్టులో ఉండాల్సిందేనని అంటున్నాడు. ‘ఫైనల్‌లో కచ్ఛితంగా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలి. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ జట్టుకి అవసరం, కానీ జడేజా మ్యాచ్ విన్నర్...
undefined
ఈ మధ్యకాలంలో జడేజా బ్యాటుతోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడడం జడేజాకి బాగా అలవాటు...
undefined
మెల్‌బోర్న్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు జడేజా, అజింకా రహానేతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ హాఫ్ సెంచరీ భారత జట్టు విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించింది.
undefined
సిడ్నీలో గాయపడినా, తొలి ఇన్నింగ్స్‌లో చక్కగా రాణించాడు. అశ్విన్ టాప్ క్లాస్ స్పిన్నర్. అందులో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో గ్రేట్ ప్లేయర్లలో అశ్విన్ ఒకడిగా నిలుస్తాడు...
undefined
భారత జట్టుకి తన బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించాడు అశ్విన్. బాల్‌తోనే కాదు, బ్యాటుతోనూ రాణించి అదరగొట్టాడు. స్వదేశాల్లోనే కాదు, విదేశాల్లోనూ అతనికి మంచి రికార్డు ఉంది...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో రవిచంద్రన్ అశ్విన్ రాణించిన విధానాన్ని ఎలా తక్కువ చేయగలం... ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన అశ్విన్, మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌ను డకౌట్ చేశాడు...
undefined
నేను కెప్టెన్ అయితే ఫైనల్ మ్యాచ్‌లో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజాను తప్పకుండా ఆడిస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.
undefined
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి ఆడిన ఏ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోకపోవడం విశేషం. కాబట్టి లక్కీ జోడీగా మారిన ఈ ఇద్దరినీ ఫైనల్‌లో ఆడించాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!