ఇంగ్లాండ్ లో రాయల్ లండన్ కప్ ఆడుతున్న సుందర్.. లంకాషైర్, వర్సెస్టర్షైర్ మధ్య ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు. అతడికి ఎడమ చేతి భుజానికి గాయమైంది. కానీ అప్పటికే జింబాబ్వే వెళ్లే భారత జట్టును ఎంపిక చేసింది టీమిండియా. ఇక అతడి గాయం పరిశీలించిన వైద్య బృందం సుందర్కు విశ్రాంతి తప్పదని తెలపడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.