ఐపీఎల్ 2021 సీజన్కి కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. భారత్లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులు సెప్టెంబర్లో యూఏఈ వేదికగా జరుగుతాయి. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న బీసీసీఐ అధికారులు, అక్కడి పరిస్థితులను పరిశీలించి, షెడ్యూల్ ఖరారు చేయబోతున్నారు.