భారత్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత ఆదివారం, సోమవారం నోబాల్, బైస్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన పాకిస్తాన్ మాజీలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. తొలి రెండురోజులు పాకిస్తాన్ జట్టును పల్లెత్తు మాట అనని మాజీ క్రికెటర్లు ఇప్పుడు షాహీన్ షా అఫ్రిది ఫిట్నెస్ కు సంబంధించి జట్టు మేనేజ్మెంట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై విమర్శలు గుప్పిస్తున్నారు.