ఎప్పటిలాగే టీమిండియా, బీసీసీఐ ఆ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే నాలుగో టెస్టు జరుగుతున్న అహ్మదాబాద్ పిచ్ మాత్రం మరోలా ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఐదున్నర సెషన్ల పాటు భారత బౌలర్లను విసిగించింది. ఒకనాక దశలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, మనవాళ్లు ఆలౌట్ చేయడం అయ్యేపని కాదని అనిపించింది.