బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదం తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో రెండు గ్రూపులున్నాయని కూడా లతీఫ్ ఆరోపించాడు. ఈ ఆఫ్ ఫీల్డ్ టెన్షన్స్.. భారత జట్టు ఆటతీరుపై దారుణంగా ప్రభావం చూపుతున్నాయని లతీఫ్ అన్నాడు. దక్షిణాఫ్రికా లో టెస్టు, వన్డే సిరీస్ ఓటమే దానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఆ సిరీస్ లో తాత్కాలిక సారథిగా నియమితుడైన కెఎల్ రాహుల్ కు ఈ టెన్షన్ లను తట్టుకునే శక్తి లేదని వ్యాఖ్యానించాడు.