160 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత జట్టు, 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్తో పాటు అక్షర్ పటేల్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ...