సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలా మారారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. భారత మాజీ జట్టు సారథి ధోని సారథ్యంలో ఈ ఇద్దరూ గత దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు కవర్ పేజీ అయ్యారు.