ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. ఏసీసీ దీనిపై ఈ నెలాఖరున తుది నిర్ణయం వెల్లడించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. భారత్ మాదిరిగానే పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలపడంతో ఈ టోర్నీ నిర్వహణ వివాదం మరో టర్న్ తీసుకుంది.