రోహిత్ భాయ్ గుస్సా.. గవాస్కర్ పై బీసీసీఐకి ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

Published : Jan 28, 2025, 08:55 PM IST

Rohit Sharma complaint against Gavaskar: భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? 

PREV
15
రోహిత్ భాయ్ గుస్సా.. గవాస్కర్ పై బీసీసీఐకి ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించి భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడింది. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు ఓటమికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు జట్టు ఘోర ప్రదర్శన ప్రధాన కారణం. 

జట్టుకు రోల్ మోడల్ గా నిలవాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.  కెప్టెన్సీలోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు నుంచి అతడిని తప్పించారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, రిటైర్మెంట్ గురించి ఎటువంటి చర్చ లేదని హిట్ మ్యాన్ ఖండించాడు.
 

25

ఆస్ట్రేలియా సిరీస్ ఓటమి కారణంగా రోహిత్ శర్మపై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో భారత మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

"బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడంతో రోహిత్ శర్మ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. జట్టు మేలు కోసం ఎవరైనా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఎంపికగా ఉండేవాడు" అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
 

 

35

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీపై కూడా సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. రోహిత్ బ్యాటింగ్ తీరుపై పై విమర్శలు చేసిన గవాస్కర్.. రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్లు రంజీల్లో ఆడాలనీ, లేదంటే బీసీసీఐ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల టీమిండియా పై కూడా సునీల్ గవాస్కర్ హాట్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గవాస్కర్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రోహిత్ ఫిర్యాదు చేశాడని వార్తలు వస్తున్నాయి.

45

 ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ తనను తాను తీవ్రంగా విమర్శించుకోవాల్సిన అవసరం లేదని రోహిత్ శ‌ర్మ చెప్పినట్టు ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి.  క్రికెట్ స‌ర్కిల్ లో న‌డుస్తున్న చ‌ర్చ ప్ర‌కారం.. సునీల్ గవాస్కర్ విమర్శల వల్ల బాహ్య ఒత్తిడి తన ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిందని రోహిత్ శర్మ బీసీసీఐ ఉన్నతాధికారులకు తెలిపాడ‌ని స‌మాచారం. 

33 సిక్సర్లు, 148 ఫోర్లతో 1458 పరుగులు! బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డు సమం

55
Rohit Sharma

కాగా, ఇటీవ‌ల భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత బీసీసీఐ ప్ర‌తి ప్లేయ‌ర్ దేశవాళీ క్రికెట్ లో ఆడాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రోహిత్ ముంబై త‌ర‌ఫున రంజీ ట్రోఫీలో ఆడాడు. అయితే, జమ్మూ & కాశ్మీర్‌తో జరిగిన రెండు ఇన్నింగ్స్‌లలో భారత టెస్ట్ కెప్టెన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేయడంతో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీకి తిరిగి రావడం పూర్తిగా నిరాశకు గురి చేసింది.

రోహిత్ మ్యాచ్ అంతటా తన అటాకింగ్ విధానాన్ని చూపించాడు, బౌలర్లపై విరుచుకుప‌డాల‌ని చూశాడు, కానీ ఉద్దేశం రోహిత్ అనుకున్న ప్రతిఫలాన్ని పొందలేదు. రెండు ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు కేవలం 3, 28  ప‌రుగులు మాత్రమే. అలాగే, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్లు కూడా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. దీంతో జమ్ము చేతిలో ముంబై ఓడిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories