గాయమైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి జడేజా అలా చెప్పాడు... క్రికెటర్ సంజూ శాంసన్...

First Published Dec 5, 2020, 12:51 PM IST

ఆసీస్ టూర్‌లో మొదటి టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ విజయానికి కారణం కంకూషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వాడుకుని టీమిండియా, రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ను ఆడించడమే అని తీవ్రంగా ఆరోపిస్తోంది ఆస్ట్రేలియా. అయితే రవీంద్ర జడేజా గాయమైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి ఏం చెప్పాడో తెలియచేశాడు సంజూ శాంసన్.

మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ బంతి నేరుగా వచ్చి రవీంద్ర జడేజా హెల్మెట్‌కి తగిలింది... దీంతో అతను రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగలేదు. అతని స్థానంలో యజ్వేంద్ర చాహాల్ 12వ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చాడు.
undefined
‘రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి రాగానే ఎలా ఉందని ఫిజియో నితిన్ పటేల్ అడిగారు. దానికి జడ్డూ... ‘తలమొత్తం డిమ్ముగా ఉందని’ సమాధానం చెప్పాడు’ అని వివరించాడు సంజూ శాంసన్.
undefined
టీమ్ డాక్టర్ అభిజిత్ సెల్వీ సలహాతో రవీంద్ర జడేజాను వైద్య పర్యవేక్షణలో ఉంచామని తెలిపాడు సంజూ శాంసన్..
undefined
టీమ్ డాక్టర్ అభిజిత్ సెల్వీ సలహాతో రవీంద్ర జడేజాను వైద్య పర్యవేక్షణలో ఉంచామని తెలిపాడు సంజూ శాంసన్..
undefined
అయితే రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ను ఆడించడం కరెక్టు కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మొయిస్ హెండ్రిక్స్...
undefined
‘కంకూషన్ సబ్‌స్టిట్యూషన్ నిబంధన ప్రకారం స్పిన్నర్ స్థానంలో స్పిన్నర్‌ను ఆడించాలి. అయితే రవీంద్ర జడేజా పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. చాహాల్ పక్కా బౌలర్. మరి జడ్డూకి చాహాల్ ఎలా రిప్లేస్ అవుతాడు’ అంటూ ప్రశ్నించాడు హెండ్రిక్స్.
undefined
రవీంద్రజడేజా స్థానంలో వచ్చిన యజ్వేంద్ర చాహాల్... ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్ వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడం భరించలేకపోతోంది ఆసీస్. ఈ కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.
undefined
click me!