‘నేను నీ వికెట్ తీశాను, కాబట్టి నోరు మూసుకో’... ధోనీ, కేవిన్ పీటర్సన్‌తో అలా అనగానే...

First Published May 27, 2021, 4:41 PM IST

భారత జట్టు సారథిగా, వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ... రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అలాగే వికెట్ల వెనకాల నుంచి ఫన్నీ కామెంటరీతో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు మాహీ. రాబిన్ ఊతప్ప తాజాగా అలాంటి ఓ సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు.

‘మహేంద్ర సింగ్ ధోనీ సెడ్జింగ్ నచ్చదు. ప్లేయర్లను వ్యక్తిగతంగా దూషించడం, తిట్టడాన్ని మాహీ అస్సలు ఎంకరేజ్ చేసేవాడు కాదు. అయితే సెడ్జింగ్‌కి పాల్పడే క్రికెటర్లకు వారిదారిలోనే సమాధానం ఇచ్చేవాడు.
undefined
ఓసారి కామెంటరీ బాక్సులో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, క్రీజులో ఉన్న నాతో మాట్లాడుతూ ధోనీ బౌలింగ్‌ను ట్రోల్ చేయాలని చూశాడు. అయితే ధోనీ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
undefined
‘ఇదిగో విను. నేను తీసిన మొట్టమొదటి వికెట్ నువ్వే... కాబట్టి నోరు మూసుకో’ అంటూ ధోనీ కౌంటర్ ఇవ్వడంతో కేవిన్ పీటర్సన్ ఏం చెప్పాలో తెలియక నవ్వేశాడు.
undefined
అతని వికెట్ కీపింగ్ ఎంత స్పీడ్‌గా ఉంటుందో మాహీ బుర్ర కూడా అంతే చురుగ్గా పనిచేస్తుంది. అందుకే మాహీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప.
undefined
2007 టీ20 వరల్డ్‌కప్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఊతప్ప, ఆ తర్వాత 2008లో చారిత్రక కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో పాల్గొన్నాడు.
undefined
‘2007లో ఆస్ట్రేలియాతో మేం ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడం. ఆ మ్యాచ్‌లో నన్ను, ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్లు రికీ పాంటింగ్ వాళ్లను సెడ్జింగ్ చేసేందుకు వాడుకున్నాడు ధోనీ.
undefined
సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ, రికీ పాంటింగ్ ఏకాగ్రతను దెబ్బతీస్తూ ఇబ్బంది పెట్టడమే నా పని. అది చాలా ఫన్నీగా ఉండేది. ఏ భారత క్రికెటర్ అయినా ఇలాంటి అనుభవమే కావాలని కోరుకుంటాడు.
undefined
ఆ రోజుల్లో ప్రతీ ప్లేయర్ కంపెనీని మేం ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లు. ఆ సమయంలో భారత జట్టుకి దక్కిన విజయాలే, టీమిండియా ఈ స్థాయిలో ఉండడానికి కారణం...’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.
undefined
click me!