మహ్మద్ షమీ భార్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్.. "ఇప్పుడు మీకు ఏమీ మిగలలేదు" అంటూ కామెంట్..
First Published Jan 2, 2021, 1:28 PM ISTఒక వైపు భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మణికట్టు గాయంతో పోరాడుతుండగా, అతని భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, ఈసారి ఆమె ఫోటోతో కాదు, దానిపై ఆమె రాసిన క్యాప్షన్ తో వైరల్ అయ్యింది. ఇటీవల హసిన్ జహాన్ ఒక అందమైన ఫోటోను సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా షేర్ చేశారు, దీనికి క్యాప్షన్ గా ఆమె తనను తాను అద్దంగా అభివర్ణించుకున్నారు. అయితే ఆ ఫోటో క్యాప్షన్ కి అభిమానులు, ఫాలోవర్స్ ఆమే పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.