మహ్మద్ షమీ భార్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్.. "ఇప్పుడు మీకు ఏమీ మిగలలేదు" అంటూ కామెంట్..

First Published Jan 2, 2021, 1:28 PM IST

 ఒక వైపు భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మణికట్టు గాయంతో పోరాడుతుండగా, అతని భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, ఈసారి ఆమె ఫోటోతో కాదు, దానిపై ఆమె రాసిన క్యాప్షన్ తో వైరల్ అయ్యింది. ఇటీవల హసిన్ జహాన్ ఒక అందమైన ఫోటోను సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా షేర్ చేశారు, దీనికి క్యాప్షన్ గా ఆమె తనను తాను అద్దంగా అభివర్ణించుకున్నారు. అయితే ఆ ఫోటో క్యాప్షన్ కి అభిమానులు, ఫాలోవర్స్ ఆమే పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొంతకాలంగా షమీ భార్య తన అందంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామరస్ పోస్ట్‌లను షేర్ చేశారు. అయితే, ఈసారి ఆమే ఫోటోపై కాకుండా దానిపై రాసిన క్యాప్షన్ కారణంగా చర్చలో నిలిచింది.
undefined
హసీన్ జహాన్ అద్దం ముందు తాను నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు, దానిపై 'ప్రజలు నన్ను అద్దంలా చూశారు, అందరూ వారి నాలో పాత్రను చూస్తున్నారు అంటూ పోస్ట్ చేసింది.
undefined
బూడిద రంగు లెహంగా ధరించిన హసీన్ జహాన్ ఈ ఫోటోలో చాలా అందంగా కనిపించారు, కాని అభిమానులు ఆమెను కామెంట్స్ రూపంలో విమర్శిస్తున్నారు. ఒక ఇన్స్తగ్రామ్ యూసర్ 'మీరు మీ ముఖ అద్దంలో చూస్తున్నారు, కానీ ఇప్పుడు మీ జీవితంలో ఏమీ మిగలలేదు' అని కామెంట్ పోస్ట్ చేయగా, మరొక యూసర్ 'మీరు పాన్ థాలే వాలేను వివాహం చేసుకున్నారని నేను నమ్మలేకపోతున్నాను' అంటూ పోస్ట్ చేశారు. మరొక యూసర్ 'మీకు డబ్బు కావాలి' అంటూ కామెంట్ చేశారు.
undefined
హసీన్ జహాన్ ఫోటోలపై షమీ అభిమానులు వారిద్దరి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రశ్నిస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
undefined
షమీ, హసీన్‌ల వివాహ సంబంధం దాదాపు 2 సంవత్సరాలు కావొస్తుంది. లైంగిక వేధింపులతో సహా మహ్మద్ షమీ ఫిక్సింగ్ చేశారని 2018 సంవత్సరంలో హసిన్ ఆరోపించారు. హసిన్ జహాన్ చేసిన ఆరోపణలపై బిసిసిఐ కూడా దర్యాప్తు చేయాల్సి వచ్చింది.
undefined
అప్పటి నుండి మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ఒక వైపు, హసీన్ తన ఫోటోల ద్వారా వైరల్ అవుతుండగా, మరోవైపు ఆమె భర్త మహ్మద్ షమీ తన మణికట్టు గాయంతో భాధపడుతున్నారు. ఈ కారణంగా షమీ భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ దూరమయ్యాడు.
undefined
click me!