టీమిండియా తరుపున ఓ వన్డే, 10 టీ20 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఆఖరిగా ఆడాడు రవి భిష్ణోయ్. ఆ మ్యాచ్లో 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన రవి భిష్ణోయ్, టీమిండియా తరపున బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు... అయితే ఆ మ్యాచ్ తర్వాత రవి భిష్ణోయ్న పూర్తిగా పక్కనబెట్టేసింది భారత జట్టు.