ఇలా ఆడితే, జట్టులో చోటు ఉంటుందా మనీశ్ అన్న... శ్రీలంకపైన కూడా మరీ ఇలానా...

First Published Jul 18, 2021, 10:52 PM IST

భారత జట్టు, లంక టూర్‌‌ను విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుని, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. అయితే తొలి వన్డేలో టీమిండియా ఫ్యాన్స్‌ని రెండు విషయాలు తీవ్రంగా నిరాశపరిచాయి...

సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి, తీవ్రంగా నిరాశపరచగా... సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన ఇచ్చాడు...
undefined
ఓపెనర్ పృథ్వీషా క్లాస్ షాట్స్‌తో ఇన్నింగ్స్ ఆరంభించగా, ఆ తర్వాత ఇషాన్ కిషన్ మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఆడుతూ చాలా స్వేచ్ఛగా షాట్స్ బాదాడు.
undefined
అలాంటిది ఆరేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన మనీశ్ పాండే మాత్రం సింగిల్స్ తీయడానికి కూడా చాలా బద్ధకం అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు.. 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి... భారీ షాట్ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
undefined
శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలని డిసైడ్ వచ్చినట్టు, తన స్టైల్‌కి తగ్గట్టుగా తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలెట్టి ఆ తర్వాత దూకుడుగా ఆడాడు... ఓ వైపు శిఖర్ ధావన్ నిలదొక్కుకున్న తర్వాత మరో ఎండ్‌లో పరుగులు చేయాల్సిన బాధ్యత మనీశ్ పాండేకి ఉంటుంది...
undefined
అయితే మనీశ్ పాండే మాత్రం అలా చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కుర్రాళ్లు బౌండరీలతో విరుచుకుపడిన లంక బౌలర్ల బౌలింగ్‌లో జిడ్డు బ్యాటింగ్ చేయడం, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
అసలే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో అతని పర్ఫామెన్స్‌తో గుర్రుగా ఉన్న అభిమానులు, మనీశ్ పాండేకి ఎందుకు అవకాశం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విరుచుకుపడడం మొదలెట్టారు...
undefined
మనీశ్ పాండే స్థానంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే, బాగుండేదని పోస్టులు చేస్తున్నారు...
undefined
పడిక్కల్ కాకపోతే రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా వంటి కుర్రాళ్లకు అయినా ఆడించండి కానీ మనీశ్ పాండే జిడ్డు బ్యాటింగ్‌ను చూడలేమని అంటున్నారు...
undefined
రాకరాక వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా చేసి చూపిస్తే... ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నా ఆట మారందంటూ మనీశ్ పాండే నిరూపిస్తున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
undefined
మనీశ్ పాండే మ్యాచ్ విన్నర్ కాదు, అందుకే టీమిండియాలో చోటు కోల్పోయాడని మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా కామెంట్ చేశాడు. అతని వ్యాఖ్యలను సమర్థించేలా సాగింది మనీశ్ పాండే ఇన్నింగ్స్ అంటున్నారు సన్‌రైజర్స్ ఫ్యాన్స్...
undefined
click me!